Home » YS Jagan
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రం పురోగతిలో వెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అని ప్రశ్నించారు. దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి 50 రోజులు అయ్యిందని..
YS Jagan - INDIA Alliance: వైసీపీ అధినేత జగన్.. ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా? త్వరలోనే ఆ కూటమిలో చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీపై పీకల్లోతు పగతో రగిలిపోయిన జగన్.. ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న టీమ్తో జత కట్టేందుకు సిద్ధమయ్యారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.
గత జగన్ సర్కారు బాధితుల్లో సామాన్యులే కాదు ఎంతో మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్.. ఇంకా చాలామంది ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గురువారం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) విమర్శించారు. సొంతబాబాయిని జగన్ చంపారని ఆరోపించారు.
ఎవ్వరూ తగ్గొద్దు.. అస్సలు తగ్గొద్దంటే తగ్గొద్దు అంతే..! గట్టిగా ఇచ్చి పడేయండి.. ఇందులో ఏ మాత్రం వెనుకంజ వేయొద్దు..! వైసీపీ (YSR Congress) చేసే రాజకీయ విమర్శలకు మంత్రులందరూ ధీటుగా బదులిచ్చి తీరాల్సిందే..!
మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి సభకు రాలేదని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన దాదాపు 40 రోజుల తర్వాత వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు.. జగన్ నాయకత్వంపై విశ్వాసం లేని నేతలంతా వైసీపీకి గుడ్బై చెబుతున్నారు.
ప్రజల సమస్యలను చర్చించి.. పరిష్కారా మార్గాలు కనుక్కోవడం, ప్రజలకు నష్టం చేసే నిర్ణయాలను ఉపసంహరించుకుని.. రాష్ట్రం, దేశానికి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకునే వేదికలు చట్టసభలు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు.