Share News

AP Elections: నంద్యాలలో లోకేష్ ‘యువగళం’ సభ... విస్తృత ఏర్పాట్లు

ABN , Publish Date - May 03 , 2024 | 11:12 AM

Andhrapradesh: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ యువగళం సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు.

AP Elections: నంద్యాలలో లోకేష్ ‘యువగళం’ సభ... విస్తృత ఏర్పాట్లు
TDP Leader Nara lokesh

అమరావతి, మే 3: నంద్యాలలో మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ (Mangalagiri TDP Candidate Nara lokesh) ‘‘యువగళం’’ సభకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు (శుక్రవారం) నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ వెనుక ప్రాంగణంలో యువగళం సభ జరుగనుంది. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహించనున్నారు. ఈ సభలో రాబోయే ఎన్నికల్లో యువత పాత్రపై యువనేత లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు.

YSRCP: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత


ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు యువగళం సభ సాగనుంది. జిల్లా నలుమూలల నుంచి యువత, విద్యార్థులు పెద్దఎత్తున యువగళం సభకు రానున్నారు. నంద్యాల సభ అనంతరం నేటి రాత్రి రాజంపేటకు యువనేత బయలుదేరి వెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం సభలకు యువతీయువకుల్లో అపూర్వస్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి పట్టణాల్లో యువగళం సభలు పూర్తయ్యాయి. 4న రాజంపేట, 5న ఏలూరు, 6న విజయనగరం, 7న శ్రీకాకుళంలో యువగళం సభలు నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.


ఇవి కూడా చదవండి...

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

YS Sharmila: వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 11:14 AM