Share News

APElections: డాక్టర్ పెమ్మసానికి అంత ఆస్తులు ఎక్కడివంటే..

ABN , Publish Date - Apr 24 , 2024 | 03:53 PM

Pemmasani Chandrasekhar: సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యంగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల25తోనామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే పడింది. రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంతధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకరిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులే.

APElections: డాక్టర్ పెమ్మసానికి అంత ఆస్తులు ఎక్కడివంటే..

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. ముఖ్యంగా నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల25తోనామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. అందరి దృష్టి అభ్యర్థుల అఫిడవిట్లపైనే పడింది. రాష్ట్రం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంతధనవంతులు ఎవరనే చర్చ కొద్ది రోజులుగా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి దృష్టిని ఆకరిస్తున్నారు గుంటూరు నుంచి ఎన్టీయే కూటమి తరపున పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దీనికి కారణం ఆయన అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులే.


ఎంపీల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రూ.5,300 కోట్ల రూపాయిల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లోపేర్కొన్నారు. తాజాగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ రూ.5,705కోట్లుగా ప్రకటించారు. దీంతో అసలు ఆయన ఎవరు.. అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. ఓ డాక్టర్ వేలకోట్ల రూపాయిలకు ఎలా అధిపతి అయ్యారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ABN Big Debate Live: సీఎం రమేశ్‌తో ఏబీఎన్ ఎండీ ఆర్కే ‘బిగ్ డిబేట్’.. ఆసక్తికర రాజకీయ చర్చ!


మొత్తం ఆస్తులు..

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్‌సభలకు పోటీచేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. తన పేరుతో రూ.2,316,54,45,165, తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో రూ.2,289,35,36,539, కుమారుడు అభినవ్‌ పేరుమీద రూ.496,27,61,094, కుమార్తె సహస్ర పేరుతో రూ.496,47,37,988 ఆస్తులున్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇవికాక.. తన పేరుతో రూ.72 కోట్ల విలువైన భూములు, భవనాలు, తన భార్య పేరుతో రూ.34 కోట్ల 82 లక్షల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. చేతిలో రూ.2,06,400లు.. భార్య దగ్గర రూ.1,51,800 నగదు ఉన్నాయని, కుమారుడు అభినవ్ వద్ద రూ.16,500, కుమార్తె సహస్ర వద్ద రూ.15,900 నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఓ రైతు కుటుంబానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.


సామాన్యుడిగా..

గుంటూర జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991 లో పదోతరగతి, 1993లో ఇంటర్ పూర్తిచేస్తారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి నేడు కోట్ల రూపాయిలకు అధిపతి అయ్యారు. కేవలం కోట్లు సంపాదించడమే కాదు.. తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వినియోగిస్తూ విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.


అమెరికాకు వెళ్లి..

ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. తనలా వైద్య విద్య అభ్యసించాలన్న ఎంతో మంది కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ను తక్కువ ధరకు ఆన్ లైన్‌లో అందించేవారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నర్సింగ్‌, ఫార్మసీ, లా, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించగలిగారు.


సేవా కార్యక్రమాలు

చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ.. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటి గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. దీనికోసం సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్‌ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన గుంటూరు లోక్‌సభ స్థానంనుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.


ఏబీఎన్‌లో చూడండి..

పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగారు.. ఆయన లక్ష్యం ఏమిటి.. ఎంపీగా గెలిస్తే ప్రజల కోసం ఆయన ఏం చేస్తారనే విషయాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో.. ఇవాళ ఏబీఎన్ ఛానల్‌లో రాత్రి 7గంటలకు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ‌తో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబెట్‌ను వీక్షించండి.

CM Ramesh: వివేకా హత్య కేసులో జగన్, భారతి ప్రమేయం ఉంది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Andhra Pradesh News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 05:15 PM