Share News

PM Modi: ఏపీలో ప్రచారం.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

ABN , Publish Date - May 06 , 2024 | 06:36 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో‌ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

PM Modi: ఏపీలో ప్రచారం.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
PM Narendra Modi

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్డీఏ కూటమి ప్రచారంలో దూసుకెళ్తుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి, అనకాపల్లిలో‌ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ఈ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేదికల్లో అధికార వైసీపీ, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.


ఈ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో మోదీ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు ‘‘ప్రియమిత్రుడు, @ncbn గారికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని ఈరోజు ఎన్డీఏ ర్యాలీలో పాల్గొన్నాను. రాజమండ్రిలో ర్యాలీలో ఉన్నాను.తర్వాత అనకాపల్లి మరొక ర్యాలీ ఉంది. ఏపీ మద్దతు మొత్తం ఎన్డీఏకే’’ అంటూ కూటమి‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Pawan Kalyan: అమృత ఘడియల వైపు భారత్.. మోదీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

Read Latest AP News And Telugu news

Updated Date - May 06 , 2024 | 06:45 PM