Share News

Viral: ఓ స్నేహితుడు సరదాగా చేసిన పనే.. ఈ కుర్రాడి ప్రాణం పోయేలా చేసింది.. మర్మాంగంలోకి పైపు ద్వారా గాలిని పంపితే..!

ABN , First Publish Date - 2023-12-02T18:23:20+05:30 IST

ఒక్కోసారి ఆకతాయిలు చేసే పనులు మిగతా వారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు సరదాగా కోసం చేసే పిచ్చి పిచ్చి పనులు కూడా చాలా సీరియస్ అవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral: ఓ స్నేహితుడు సరదాగా చేసిన పనే.. ఈ కుర్రాడి ప్రాణం పోయేలా చేసింది.. మర్మాంగంలోకి పైపు ద్వారా గాలిని పంపితే..!
ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి ఆకతాయిలు చేసే పనులు మిగతా వారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇంకొన్నిసార్లు సరదాగా కోసం చేసే పిచ్చి పిచ్చి పనులు కూడా చాలా సీరియస్ అవుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్నేహితులు సరదాగా చేసిన పని.. చివరకు ఓ కుర్రాడి ప్రాణం తీసింది. మర్మాంగంలోకి పైపు ద్వారా గాలి నింపడంతో చివరకు ఏం జరిగిందంటే..

హర్యానాలోని (Haryana) పానిపట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సివాహ్ గ్రామానికి చెందిన మనీష్ అనే యువకుడు.. సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. రోజూ లాగానే బుధవారం కూడా మనీష్ విధులకు హాజరయ్యాడు. అక్కడ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పని చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ ఓ పందెం కాసుకున్నారు. మనీష్ ప్రైవేట్ పార్ట్‌లోకి పైపు ద్వారా గాలి నింపాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు మనీష్ కూడా అంగీకరించడంతో మిగతా ఇద్దరూ అతడి (Air filled into the man private part) మర్మాంగంలోకి పైపు ద్వారా గాలిని నింపారు.

Marriage: అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. బంధువులందరి ముందే అసలు నిజం చెప్పి..!

man-viral-news.jpg

గాలి నింపిన కొద్ది సేపటికే మనీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో చుట్టు పక్కల వారు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతుడికి ఓ సోదరుడు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. మనీష్‌కు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నట్లు తెలిసింది. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Viral: పిల్లలతో కలిసి చలిమంట వేసుకున్న తల్లి.. సడన్‌గా ఎంటరైన పులి.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2023-12-02T18:23:22+05:30 IST