Home » Haryana
కెనడాలో భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్పై కాల్పులు జరిగాయి. వాంకోవర్ ప్రాంతంలో ఆడి కారులో ఉన్న చిరాగ్పై ఈ నెల 12వ తేదీన కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా చిరాగ్ విగతజీవిగా కనిపించాడు.
డెహ్రాడూన్కు చెందిన గర్విట్, నందిని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే వారు. మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సంపాదన బాగుంది. ఆ జంటతో ఐదుగురు కలిసి ఉంటారు. ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు.. మార్కెట్ పెంచుకోవచ్చని ఇటీవల హర్యానా వచ్చారు.
హర్యానాలో గురువారం ఉదయం ఆరుగురు విద్యార్థులను చిదిమేసిన స్కూల్ బస్ ఘటనలో ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్, పాఠశాల కార్యదర్శి కూడా ఉన్నారు. డ్రైవర్కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
హర్యానాలో ( Haryana ) ఘోర ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద నియంత్రణ కోల్పోయింది.
ఇండియాకు చెందిన విస్కీ బ్రాండ్ 'ఇంద్రీ(Indr)' అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న(fastest growing brand) విస్కీగా గుర్తింపు సాధించింది. పూర్తిగా బారత్(bharat)లో తయారైన ఈ బ్రాండ్ దేశంతోపాటు విదేశాల్లో కూడా శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తుంది.
హర్యానా బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత సింగ్ మంగళవారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, పవన్ ఖేరా, పలువురు మద్దతుదారుల సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు.
లోక్సభ ఎన్నికల వేళ హర్యానా లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్లో చేరుతున్నట్టు తెలిపారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి రానున్నారా? ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో హర్యానా నుంచి ఆయన పోటీ చేయనున్నారా? కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలకు సంజయ్ దత్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా జవాబిచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఈ మధ్యే కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు కురుక్షేత్ర నుంచి లోక్ సభ ఎన్నికలకు టికెట్ కేటాయించింది.
హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హిస్సార్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ.. దశాబ్దం పాటు ప్రజలకు సేవా చేశానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.