Hotel Room: మా ఇల్లు అమ్మేశాం.. వేరే ఇల్లు చూసేదాకా ఉంటామంటూ హోటల్‌లో నెల నుంచి మకాం.. ఓ రోజు రాత్రి 11 గంటల టైమ్‌లో..

ABN , First Publish Date - 2023-05-02T18:16:15+05:30 IST

భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన మహిళలు కొందరు.. తెలిసి తెలిసి తప్పులు చేసి చివరకు దారుణంగా మోసపోతుంటారు. మరికొందరు చివరకు హత్యలు, ఆత్మహత్యలకు గురవుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా..

Hotel Room: మా ఇల్లు అమ్మేశాం.. వేరే ఇల్లు చూసేదాకా ఉంటామంటూ హోటల్‌లో నెల నుంచి మకాం.. ఓ రోజు రాత్రి 11 గంటల టైమ్‌లో..
ప్రతీకాత్మక చిత్రం

భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన మహిళలు కొందరు.. తెలిసి తెలిసి తప్పులు చేసి చివరకు దారుణంగా మోసపోతుంటారు. మరికొందరు చివరకు హత్యలు, ఆత్మహత్యలకు గురవుతుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ ఓ యువకుడితో కలిసి హోటల్‌కి వెళ్లింది. ‘‘మా ఇల్లు అమ్మేశాం.. వేరే ఇల్లు చూసేదాకా ఉంటాం’’.. అని చెప్పి హోటల్‍‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. నెల రోజులుగా అందులోనే ఉంటున్నారు. ఓ రోజు రాత్రి 11 గంటల సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. తలుపులు ఎవరూ తీయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. చివరకు తమ వద్ద ఉన్న కీతో తలుపులు తీసి చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మొహాలీ లోహఘర్ ప్రాంతంలోని సిగ్మా సిటీ చౌక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కాంగ్రా ప్రాంతానికి చెందిన బబిత (33) అనే మహిళ (woman) తన ఇద్దరు పిల్లలు, సునీత్ అనే యువకుడితో కలిసి ఇటీవల సిగ్మా సిటీ చౌక్ ప్రాంతానికి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు (Hotel) వెల్లారు. తమ ఊర్లోని సొంత ఇంటిని అమ్మి వచ్చామని, కొత్త ఇల్లు చూసుకునే వరకూ హోటల్‌లో ఉంటామంటూ సిబ్బంది తెలియజేసి హోటల్లో ఓ గదిని తీసుకున్నారు. అప్పటి నుంచి గదిలోనే ఉంటున్నారు. అయితే ఆదివారం ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

Viral news: బంధువులంతా ఎదురు చూస్తుంటే.. ఎవరికీ తెలియదులే అనుకుంటూ.. వివాహానికి కాస్త ముందు వధువు చేసిన పనితో.. చివరకు..

ఉదయం పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన వారు.. వారిని తెలిసిన వారి వద్ద ఉంచి తిరిగి వారిద్దే హోటల్‌కి వచ్చారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. రాత్రి 11 గంటల ప్రాంతంలో సునీత్ ఒక్కడు బయటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు మూసి ఉన్నాయి. గదిని శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది తలుపులు తట్టినా ఎవరూ తీయలేదు. చాలా సేపు వేచి చూసినా ఎవరూ స్పందించకపోవడంతో చివరకు వారి వద్ద ఉన్న కీతో తలుపులు తెరిచారు. గదిలోకి వెళ్లి చూడగా మహిళ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral News: ఆపరేషన్ చేసుకున్నా కూడా గర్భవతిని ఎలా అయ్యానంటూ ఓ మహిళకు డౌట్.. జరిగింది తెలిసి న్యాయపోరాటం.. చివరకు..

Updated Date - 2023-05-02T18:17:28+05:30 IST