Home » Himachal Pradesh
భారీ మంచు కారణంగా పాంగి లోయ కొత్త శోభను సంతరించుకుంది. లోయలో మంచు ప్రవాహం మొదలైంది. మంచు నది ఏమైనా ప్రవహిస్తోందా? అనేంతలా అక్కడి పరిస్థితి మారిపోయింది..
హిమాచల్ ప్రదేశ్లో ఒక భావోద్వేగాత్మక, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఓ పెంపుడు శునకం తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు కాపాడుకుంది. ఎముకలు కొరికే మంచు కొండల్లో అన్నపానీయాలు మానేసి కనురెప్ప వాల్చకుండా కాపుకాసింది.
మానాలిలో భారీగా మంచు కురుస్తోంది. కొన్నిచోట్ల రోడ్లను మంచు కప్పేయడంతో స్వల్ప ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం హరిపుర్దార్ ఏరియాలోని ఇరుకైన రహదారిపై వెళ్తుండగా బస్సు అదుపుతప్పి లోయలో పడింది. తక్షణ హాయక కార్యక్రమాలు చేపట్టినట్టు సిర్మూర్ ఎస్పీ నిశ్చింత్ సింగ్ నెగి తెలిపారు.
కాలేజీ లెక్చరర్, ముగ్గురు విద్యార్థినీల వేధింపులకు 19 ఏళ్ల యువతి మృతి చెందింది. మానసికంగా వేదనకు గురై..దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో జరిగింది.
ఆస్పత్రిలో పేషంట్, డాక్టర్ మధ్య భీకర పోరు చోటుచేసుకుంది. ఇద్దరూ బెడ్ మీద పడి పొట్టుపొట్టు కొట్టుకున్నారు. కొన్ని నిమిషాల పాటు ఆ వార్డు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ స్టేజ్ను తలపించింది.
హిమాచల్ ప్రదేశ్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 15 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన కొడుకు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
రీల్స్ పిచ్చికి మరో నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడు బైక్ స్టంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది.
పాలక్వా గ్రామంలోకి అక్టోబర్ 20వ తేదీన చిరుత ప్రవేశించింది. పొలాల్లోని పొదల మాటున దాక్కుంది. అటువైపు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చిరుత పులి అరుపులు విన్నారు. భయంతో అరుస్తూ గ్రామంలోకి పరుగులు తీసే ప్రయత్నం చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..