Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.
హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాంగా ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై కొండచరియలు విరిగిపడటంతో 13 మంది మృతి చెందారు.
హిమాచల్ ప్రదేశ్లోని కసోల్లో కొందరు టూరిస్టుల వింతచేష్టలు వివాదానికి తెరతీశాయి. కారు టాప్పై కూర్చొని అర్ధనగ్నంగా ప్రయాణించిన వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ధర్మశాల వేదికగా ఇవాళ భారత్ , అఫ్గానిస్థాన్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్కు వాన ముప్పు పొంచి ఉంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికలు జరిగిన మండి (15 వార్డులు), పాలంపూర్ (15 వార్డులు), సోలాన్ (17 వార్డుల), ధర్మశాల (17 వార్డులు) మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలను ప్రకటించారు.
రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల ఓ చిన్నారిపై మాజీ ఆర్మీ ఉద్యోగి దారుణానికి ఒడిగట్టాడు. చెట్టునుంచి జామకాయ తెంపిందన్న కోపంతో చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి మరీ చిత్ర హింసలు పెట్టాడు.
రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. కుక్క అతడి ప్యాంట్ పట్టుకుని లాగడంతో రోడ్డుపై పడిపోయాడు. తలకు గాయాలు అయ్యాయి. హిమాచల్ప్రదేశ్లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది.