Home » Himachal Pradesh
లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య ఎస్యూవీ కారు చోరీకి గురయ్యింది. దక్షిణ తూర్పు ఢిల్లీలో గల గోవింద్ పురి ప్రాంతంలో ఉన్న సర్వీసింగ్ సెంటర్ నుంచి కారు దొంగతనం జరిగింది. కారును సర్వీసింగ్కు ఇచ్చి డ్రైవర్ తినడానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా సర్వీస్ సెంటర్లో కారు కనిపించలేదు.
హిమాచల్ ప్రదేశ్ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఫిర్యాదుతో స్పీకర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేశారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును రెబల్ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు. సానుకూల తీర్పు రాకపోవడంతో ఆరుగురు రెబల్స్ శనివారం నాడు (ఈరోజు) బీజేపీలో చేరారు.
హిమాచల్ ప్రదేశ్లో వేగంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శుక్రవారంనాడు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీరు సిద్ధమవుతున్నారు.
ఇటివల కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్ ఎక్కువైంది. పెళ్లి చేసుకోబోయే ప్రతి జంట దాదాపు అనేక ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరుతో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ నటి ఆర్య వోరా(Aarya Voraa) ప్రీ వెడ్డింగ్ షూట్(pre wedding shoot) తన ప్రాణాలమీదకు వచ్చిందని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ రెబల్ ఆరుగురు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై స్టే విధించాలని కోరగా, సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
హిమాచల్ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఎన్నికల్లో నేరాలకు పాల్పడ్డారంటూ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే తండ్రి, మరికొందరిపై పోలీసులు ఆదివారం కేసులు నమోదు చేశారు.
సుఖ్వీందర్ సింగ్ సుఖు సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తలెత్తిన విభేదాల పరిష్కారానికి కాంగ్రెస్ అధిష్ఠానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మెరుగైన సమన్వయం కోసం ఆరుగురు సభ్యులతో సమన్వయ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారంనాడు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం(Himachal pradesh crisis) మరింత ముదిరింది. కాంగ్రెస్ తిరుగుబాటుదారులతో సహా 11 మంది ఎమ్మెల్యేలు శనివారం బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చేరుకున్నారు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.