Viral News: ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వ్యక్తికి బిగ్ షాకిచ్చిన పోలీసులు.. సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి..!

ABN , First Publish Date - 2023-06-27T20:52:51+05:30 IST

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. ప్రధానంగా కొందరు వాహనదారుల నిర్లక్ష్యం.. ఎదుటివారికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఒక బైకులో ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చూశాం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను ఒకే స్కూటీపై తీసుకెళ్లి ..

Viral News: ఒకే స్కూటీపై ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వ్యక్తికి బిగ్ షాకిచ్చిన పోలీసులు.. సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి..!

తప్పని తెలిసినా చాలా మంది నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తుంటారు. ప్రధానంగా కొందరు వాహనదారుల నిర్లక్ష్యం.. ఎదుటివారికి ప్రాణసంకటం అవుతుంటుంది. ఒక బైకులో ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చూశాం. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలను ఒకే స్కూటీపై తీసుకెళ్లి నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. సదరు వ్యక్తిపై సరికొత్త సెక్షన్‌తో కేసు పెట్టి.. నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారందరికీ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

ఒకే స్కూటీపై (Seven children travel on one scooty) ఏడుగురు పిల్లల్ని తీసుకెళ్లిన వీడియో (Viral video) వైరల్ అయిన విషయం తెలిసిందే. ముంబైలోని రద్దీగా ఉండే రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీ వెనుక వైపు ఓ పిల్లాడు నిలబడి ఉండగా.. మధ్యలో ముగ్గురు పిల్లలు కూర్చుని ఉన్నారు. మరోవైపు స్కూటీకి ఓ వైపు ఓ పిల్లాడు ప్రమాదకరంగా వేలాడుతుండగా.. ముందు వైపు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంత మంది పిల్లల్ని తీసుకెళ్లడం చూసి మిగతా వాహనదారులంతా అవాక్కయ్యారు.

Viral Video: ఒకే స్కూటీపై ఏకంగా 8 మంది.. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి వీడియోను తీశాడో వ్యక్తి.. నెట్టింట పోస్ట్ చేస్తే..!

ఈ వీడియోను ఓ వ్యక్తి ముంబై పోలీస్ (Mumbai Police) , సీపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రికి (Maharashtra Chief Minister) ట్యాగ్ చేశాడు. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఏడుగురు పిల్లల్ని ఒకే స్కూటీపై తీసుకెళ్లడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించారు. అతనిపై నిర్భయ హత్యానేరం కేసు నమోదైంది. బైకర్‌పై హత్యానేరం కేసు నమోదు చేయడం బహుశా ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. వాహనదారులు నిబంధనలు పాటించాలని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాగా, ముంబై ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ పోస్టు.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..

Updated Date - 2023-06-27T20:52:51+05:30 IST