Share News

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!

ABN , First Publish Date - 2023-11-09T18:39:41+05:30 IST

కొన్ని ప్రేమ వ్యవహారాలు చివరకు పెళ్లి వరకూ వెళ్తుంటాయి. అలాగే మరికొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఎంతకూ బయటకు రాని ప్రేమ జంట.. ఎన్నిసార్లు పిలిచినా నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి చూస్తే..!
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని ప్రేమ వ్యవహారాలు చివరకు పెళ్లి వరకూ వెళ్తుంటాయి. అలాగే మరికొన్ని ప్రేమలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఇంకొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, దేజ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు ఓయో హోటల్‌కి వెళ్లారు. అయితే ఎంతకీ బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. చివరకు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈశాన్య ఢిల్లీ పరిధి జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోహ్రాబ్ అనే యువకుడికి.. కొంతకాలం క్రితం ఆయేషా అనే యువతితో (young woman) పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఇటీవల ఇద్దరూ కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 27న ఇద్దరూ కలిసి స్థానిక ఓయో హోటల్‌కి (Oyo Hotel) వెళ్లారు. మధ్యాహ్న సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. నాలుగు గంటల పాటు గది అద్దెకు తీసుకున్న వారు.. ఎంతకీ బయటికి రాలేదు. మధ్యలో హోటల్ సిబ్బంది తలుపులు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

Viral: మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంటి సామీ.. చోరీ చేసిన డబ్బుతోనే ప్రేమ పెళ్లి చేసుకుని.. నేరుగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి మరీ..!

దీంతో చివరకు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. గదిలోకి వెళ్లగానే యువకుడు (Lovers committed suicide) ఉరికి వేలాడుతూ కనిపించగా.. యువతి బెడ్‌పై నిర్జీవంగా పడి ఉంది. పక్కనే ఉన్న ఓ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘మేమిద్దరం ప్రేమించుకున్నాం.. మా జీవితాలను ముగించాలని నిర్ణయించుకుంటున్నాం’’.. అని అందులో రాసి ఉంది. అలాగే హోటల్లోని సీసీ కెమెరాలను మొత్తం పరిశీలించారు. గదిలోకి వెళ్లిన తర్వాత యువతిని గొంతు నులిమి చంపేసి, తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shocking: 14 ఏళ్ల బాలికతో పాటు స్టేషన్‌కు వచ్చిందో మహిళ.. మా పక్కింటి అమ్మాయేనంటూ ఆమె చెప్పింది విని అందరికీ షాక్.. చివరకు..!

Updated Date - 2023-11-09T18:46:15+05:30 IST