Chandrababu: ఇవన్నీ నిజాలు కాదా..? చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సర్కారును నిలదీసిన ప్రవాసులు

ABN , First Publish Date - 2023-09-22T15:38:28+05:30 IST

ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

Chandrababu: ఇవన్నీ నిజాలు కాదా..? చంద్రబాబు అరెస్ట్‌పై జగన్ సర్కారును నిలదీసిన ప్రవాసులు

ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎన్నారై టీడీపీ గల్ప్ కౌన్సిల్ నాయకులు వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, ఎన్నారై టీడీపీ కువైత్ ప్రధాన కార్యదర్శిమల్లి మారోతు, కోశాధికారి రాచూరి మోహన్‌ల ఆధ్వర్యంలో కువైట్‌లో జనసేన నాయకులతో కలిసి చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ ప్రకటించిన నేపథ్యంలో కువైత్‌లో రెండు పార్టీల నాయకులు సంయుక్తంగా ఒకే వేదిక ద్వారా భవిష్యత్ లో కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను స్వార్థ రాజకీయాల కోసం, కక్ష సాధింపు రాజకీయాలు చేయడం కోసం వైసీపీ అధినేత జగన్ వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలు జరిపిన అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ బడ్జెట్‌తో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేశారని గుర్తు చేశారు. 371 కోట్ల రూపాయల పన్నులతో కలిపి ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్ కంపెనీ కి నిధులు విడుదల చేసిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన ఆ నిధులకు సరిపడా పరికరాలు ఉన్నాయా ? లేదా ? అన్నది చూస్తే అసలు నిజమేంటో అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Kuwait-1.jpg

‘అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి ఎక్విప్మెంట్ అంతా చేరిందని అప్పటి అధికారులు నిర్ధారించింది వాస్తవం కాదా..? కేంద్ర ఆడిట్ సంస్థ కూడా అన్ని సక్రమంగా ఉన్నాయని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా..? మీరు సిమెన్స్‌కు లేఖను రాస్తే.. వారు ఇచ్చిన సమాధానంలో in aid grant లేదు, in kind grant మా దగ్గర ఉందంటూ.. దాని ప్రకారమే మేము ఆంధ్రప్రదేశ్‌కు సాఫ్ట్‌వేర్‌ను ఇచ్చామని చెప్పిన మాట నిజం కాదా.. డిజైన్ టెక్‌కు విడుదల చేసిన నిధులు మళ్ళీ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరాయన్నదానికి సరైన సాక్ష్యాలను కోర్టు ముందు ఎందుకు తీసుకురావడం లేదు..? షెల్ కంపెనీల పేర్లు, ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి..? వాటి డైరెక్టర్‌లు ఎవరు? వాటికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయా? ఉంటే డిజైన్ టెక్ ద్వారా డబ్బులు ఆ ఖాతాలోకి వచ్చాయా? వచ్చిన డబ్బులు చంద్రబాబకు అందినట్లు రుజువులు ఉన్నాయా..? Siemens CEO(india) ఈ ప్రాజెక్ట్ ఒప్పందాల పై సంతకం పెట్టినది వాస్తవం కాదా? స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందారు. వారికి అయిన ఖర్చు ఎంత? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? అసలు ఈ పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదు అనే విషయం ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలుసు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ ప్రచారాలకు వస్తున్న ఆదరణ చూసే జగన్‌కు వణుకు పుట్టింది. అందుకే నీచ రాజకీయాలను చేయడం మొదలు పెట్టారు..’ అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.

‘మా నాయకుడి నిర్ణయం మాకు శిరోధార్యం.. నీతివంతమైన రాజకీయాలు చేసిన చంద్రబాబుకు నీతి, నిజాయితీగల మా నాయకుడు మద్దతు ఇచ్చారు..’ అంటూ జనసేన నాయకులు వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో అన్ని కార్యక్రమాలను రెండు పార్టీలు కలిసి చేస్తాయనీ.. ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం వైసీపీ పాలకులను ప్రజా కోర్టులో దోషులుగా నిలబెట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని టీడీపీ, జనసేన నేతలు వెల్లడించారు.

Kuwait-2.jpg

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు సుబ్బారాయుడు, బాలకృష్ణ, భాస్కర్, శ్రీనివాస్, చిన్నరాజు, గుండయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శి మల్లి మారోతు, రాచూరి మోహన్, రమేష్, హేమంత్, ముస్తాక్, రెడ్డయ్య చౌదరీ, నాలుగు గవర్నరేట్ కమిటీల సభ్యులు, బీసీ అధ్యక్షులు శంకర్ యాదవ్, మహేష్, పెంచలయ్య యాదవ్, నరసింహ, శివా, తెలుగు యువత మురళి, శీను, జనసేన నాయకులు హరి రాయల్, చంద్ర శేఖర్, అలీ, జిలకర మురళి, పత్తి సుబ్బారాయుడు, గంటా సురేష్, కోనసీమ రాజేష్ సహా ఇతర టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T15:38:28+05:30 IST