Home » Gulf News
పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ అన్నారు
లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున లెబనాన్లోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా హెజ్బొల్లా మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
భారతీయ సిబ్బంది ఉన్న ఒక ఎల్పీజీ క్యారియర్ తాజాగా హోర్ముజ్ జలసంధిని దాటింది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్కు చేరుకుంటుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ను దాటేందుకు ఇరాన్కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తామని వివిధ షిప్పింగ్ సంస్థలను అమెరికా తాజాగా హెచ్చరించింది.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి యుద్ధం లేదూ.. ప్రశాంతతా లేదూ అన్నట్టు ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
యుద్ధం మళ్లీ మొదలు కావచ్చని ఇరాన్ సైనికాధికారి ఒకరు హెచ్చరిక చేశారు. గతంలో తమతో ఏకాభిప్రాయానికి వచ్చిన యూఎస్ మళ్లీ కట్టుతప్పుతున్న దాఖలాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో జర్మనీ సహా ఇతర నాటో మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న అసంతృప్తితో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న అమెరికా సైనికుల్లో 5 వేల మందిని తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇరాన్ కీలక రాజకీయ నాయకుల మధ్య ఎడం పెరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. విదేశాంగ మంత్రిని తొలగించాల్సి రావచ్చని అధ్యక్షుడు పెజెష్కియాన్ తన సన్నిహితుల వద్ద అన్నట్టు కథనాలు వెలువడ్డాయి.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రితో ఫోన్లో మాట్లాడిన ఆయన, అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం, బెదిరింపుల మధ్య తాము చర్చలకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.