Home » Gulf News
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'పేరుతో ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా, అది మిగిలిన రెండింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
దుబాయిలో భారత కాన్సుల్ జనరల్గాతెలుగు వ్యక్తి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్గా తెలుగు వ్యక్తి రావడంతో దుబా యి, ఇతర ఎమిరేట్లలోని తెలుగు ప్రవాసీలలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్నప్పటికీ ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉన్నత సలహాదారుల బృందంలో తీవ్ర భేదాభిప్రాయాలే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా అంటోంది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వ్యాపార సముద్ర మార్గాలలో నౌకల రక్షణే లక్ష్యంగా సౌదీ అరేబియా కీలకమైన రక్షణ కూటమిని ప్రకటించింది. ఈ కూటమిలో13 దేశాలు భాగస్వాములుగా చేరినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇరాన్కు చైనా ఆయుధాలను విక్రయిస్తే తాను తీవ్ర నిరాశకు గురవుతానని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జిన్పింగ్ గతంలో తనకు స్వయంగా హామీ ఇచ్చారని, ఆ మాటపై నిలబడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడికి దిగిన నేపథ్యంలో, దానికి ప్రతికారంగా యూఎస్ మిలిటరీ.. ఇరాన్లోని లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
ఇరాక్లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ.. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ జరిపిన ఈ దాడుల్లో భారతీయ నావికుడు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.