Home » Gulf News
యూఏఈలోని అణువిద్యుత్ కేంద్రంపై దాడి జరగడాన్ని భారత్ తాజాగా ఖండించింది. పరిస్థితి ప్రమాదకరమైన మలుపు తిరుగుతోందని హెచ్చరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రక్రియలో భాగంగా అమెరికా.. ఇరాన్ ముందు 5 కఠినమైన నిబంధనలను ఉంచింది. అమెరికా పెట్టిన ఈ నిబంధనలపై ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చర్చలు తదుపరి దశకు వెళ్లాలంటే ఇరాన్ కూడా తన వైపు నుంచి ఐదు హామీలను అమెరికా ముందుంచింది.
భారత్కు బయలుదేరిన ఒక ఎల్పీజీ ట్యాంకర్ సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్టు తెలుస్తోంది. నౌక సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా భారత నావికాదళం అన్ని సహాయసహకారాలు అందిస్తోంది.
బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు త్వరలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ భారత్కు రానున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధిలోని నావలో మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు కన్నుమూశారు. ఘటన సమయంలో నావలో మొత్తం 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి దుబాయ్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ అన్నారు
లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఈ తెల్లవారుజామున లెబనాన్లోని వివిధ ప్రాంతాల్లో 50కి పైగా హెజ్బొల్లా మౌలిక సదుపాయాల కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
భారతీయ సిబ్బంది ఉన్న ఒక ఎల్పీజీ క్యారియర్ తాజాగా హోర్ముజ్ జలసంధిని దాటింది. మరికొన్ని రోజుల్లో ఈ నౌక భారత్కు చేరుకుంటుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ను దాటేందుకు ఇరాన్కు టోల్ చెల్లిస్తే ఆంక్షలు విధిస్తామని వివిధ షిప్పింగ్ సంస్థలను అమెరికా తాజాగా హెచ్చరించింది.