Home » Andhra Pradesh » Prakasam
ఒంగోలు నగరంలో పార్కులన్నీ నామరూపాలు కోల్పోయాయి. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు ఆటలు ఆడుకునేందుకు ఏ పార్క్లో కూడా సరైన వసతులు మృగ్యమయ్యాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పార్కులన్నీ కళావిహీనంగా మారాయి.
బెల్లంకొండవారిపాలెంలో నేతలు పార్టీ మారిన నేపథ్యంలో వైసీపీ వారు హైడ్రామాను సృష్టించారు. వైసీపీని వీడి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన ఆ గ్రామ నేతలపై అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి తెచ్చింది.
వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు, సిబ్బందికి గత ఎన్నికలకు చెల్లించిన నామమాత్రపు రెమ్యునరేషన్ ఇప్పుడు కూడా చెల్లించనున్నారు. 2019 సాధారణ ఎన్నికలకు నియమితులైన అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ మొత్తాలనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధులకు నియమితులైన వారికి చెల్లించనున్నారు.
ఒంగోలు లోక్సభ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఆపార్టీ నేతలు చిటపటలాడుతున్నారు. మమ్మల్ని నమ్మడు, మాకేం చెప్పడు, పెత్తనమంతా పరాయి వాళ్లకే ఇస్తున్నాడంటూ కిందిస్థాయిలోని నాయకులు గగ్గోలుపెడుతున్నారు.
జిల్లాలో టీడీపీ కూటమి తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నందమూరి బాలకృష్ణతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ప్రచారం నిర్వహించనున్నారు.
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వం సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో నెలకో నిర్ణయం తీసుకుంటోంది. ఈ నెలలో సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేయగా, వచ్చే నెలలో డీబీటీ పద్ధతిలో వీటిని జమచేయాలని నిర్ణయించింది.
సూరీడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నానికి మంటపుట్టిస్తున్నాడు. ఆదివారం మోతాదు మరింత పెంచాడు.
న్నికల నేపఽథ్యం లో పంపిణీ నిమిత్తం వైసీపీ నాయకులు గో వా నుంచి ప్రత్యేకంగా తెప్పించి, నిల్వచేసిన మద్యం డంపు దొరికిపోయింది. ఎస్ఈబీ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు.
జిల్లాలో గత ఏడా ది ప్రభుత్వం ద్వారా బదిలీ ఉత్తర్వులు పొంది ఇతర పాఠశాలలకు వెళ్లి పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపునకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగా యి. కొద్ది నిమిషాల్లోని బస్సు దగ్ధమెంది.