తెలంగాణ ఆర్టీసీ బస్సు దగ్ధం
ABN , Publish Date - Apr 29 , 2024 | 01:22 AM
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగా యి. కొద్ది నిమిషాల్లోని బస్సు దగ్ధమెంది.
ప్రయాణికులు అందరూ క్షేమం
టంగుటూరు, ఏప్రిల్ 28: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగా యి. కొద్ది నిమిషాల్లోని బస్సు దగ్ధమెంది. ఈ సంఘటన టంగుటూరు మండలం సూ రారెడ్డిపాలెం వద్ద ఆదివారం రాత్రి 11 గంటలు దాటిన త రువాత జరిగింది. బస్సు సూ రారెడ్డిపాలెం వద్దకు రాగానే లోపల మంటలు రేగడంతో అప్రమత్తమైన డ్రైవ ర్ వెంటనే ప్రయాణికులను కిందకు దించాడు. దీంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు లో 32మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజన్లో షార్ట్సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.