ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం అత్యాధునిక త్రీడీ లేజర్ షోతో కనువిందు చేయనుంది.
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని స్వగ్రామానికి వచ్చారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు.
వరంగల్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున హాష్ ఆయిల్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను డ్రగ్ కంట్రోల్ పార్టీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు..
మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఈ అంశంపై బీజేపీ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు.
వరంగల్లో కొలువుదీరిన భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం భద్రకాళీ అమ్మవారికి గణపతి పూజతో ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ కేటీపీపీ ప్లాంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు నిల్వల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిలోమీటర్ల మేర పొగ వ్యాపించింది.
కన్న కొడుకులను బిస్కెట్లో విషం కలిపి చంపాలని తండ్రి సుపారీ ఇవ్వడం కలకలం రేపింది. జనగామ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు విమర్శించారు. సీట్ల పెంపు అనేది 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.