ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల్లో వానలు కురవకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్కు సంబంధించి రైతులు ఎక్కువగా వరి సాగును చేపట్టారు.
మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ వెన్నచెడ్ గ్రామంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వా టర్ ట్యాంక్ శిథిలావస ్థకు చేరింది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.
జిల్లాలో వరుస చోరీలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తు తున్నారు. వరుస దొంగతనాల, చైన్ స్నాచింగ్ పాల్పడిన వారంతా మహారాష్ట్ర ముఠాగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గతంలో ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండులు, రైల్వేస్టేషన్లను లక్ష్యం చేసుకొని చోరీలకు పాల్పడిన దుండగులు ప్రస్తుతం మహిళల మెడల్లోని బంగారు ఆభరణాపై కన్నేశారు.
వాంకిడి మండల కేంద్రంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ప్రభుత్వ ఆర్డర్లు లేక మూతపడింది. దీంతో పనులు లేక కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో కుటుంబాల పోషణకు కార్మికులు ఇబ్బందు లు పడుతున్నారు. గతంలో 60 మందికి పైగా కార్మికులకు ఉపాధినందించిన ఈ పరిశ్రమ నేడు పనులు లేక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తోంది. రాష్ట్రంలో 1971లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో 56 సీఎఫ్సీ (కామన్ ఫెసిలిటీ సెంటర్) కేంద్రాలను ప్రారంభించారు. అందులో భాగంగానే అప్పటి తాలుకా కేంద్రమైన వాంకిడిలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రెబ్బెన సీఐ సంజయ్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం కమ్యూనిటి కాంటాక్టు కార్యక్రమాన్ని నిర్వహించారు.
పూలాజీ బాబా బోధనలు ఆచరణీయమని ఎంపీ గోడం నగేష్ అన్నారు. జైనూర్ మండలం పట్నాపూర్లోని సిద్ధేశ్వర సంస్థాన్లో ఆదివారం నిర్వహించిన పూలాజీ బాబా జన్మదిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కెహరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు పటేల్ లతో కలిసి హాజరయ్యారు
కుమరం భీం జిల్లా ఏజెన్సీ పరిధిలోని గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేకపోవడం, అంబులెన్స్లు సైతం వెళ్లలేక పోవడం వల్లే గర్భిణులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందటే చాలు పొంగి పొర్లుతున్న వాగులు అడుగు తీసి అడుగు వేయలేని దారులు.. అంబులెన్స్లు రాని రహదారులు.. అక్కడి తల్లులకు ప్రసవ వేదనకు గురిచేస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం గడిసింగపూర్ సమీపంలోని చింతల చెరువు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది.