సర్ ప్రక్రియను ఆన్లైన్లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటా సిబ్బంది అందజేశారు. ఎన్యూమరేషన్ వివరాలు 2002 ఓటరు జాబితాతో వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్వో వద్ద సమర్పించాల్సి ఉంటుంది.
కొల్లాపూర్ మండలంలోని ప్రసి ద్ధ జిల్దార్ తిప్ప చెరువుకు తక్షణమే కృష్ణా జలాలు మళ్లించి, దాని కింద ఉన్న వేలాది ఎకరాల ఆయకట్టుకు సా గునీరు అందించకపోతే ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ హెచ్చరిం చారు.
టరు జా బితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ స జావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయం తో పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్లో గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ జిల్లాలో 100 శాతం పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలన్నారు
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా వ్యవసాయా ఆధికారి బి.వెంకట్ తెలిపారు. గురువారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రైతులు వరికి బదులు కందులు, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, నువ్వులు, ఆముదం వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు
మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే చేపపిల్లలు ఇంకా చెరువుకు చేరుకోలే దు. అసలే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొ న్నాయి. చెరువు, కుంటల్లోనూ అంతంతమాత్రం గానే నీళ్లు ఉన్నాయి. అయినా చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో టెండల్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్-నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యల కోసం రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్-2026ను సిద్ధం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీజీ-20 పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన ఆటగాళ్లను అభినందిస్తూ తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ఇప్పుడే నియంత్రించక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలతో కుటుంబాలు జీవితకాల పొదుపు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.