దశాబ్ధాల క్రితం నిర్మించిన బ్రిడ్జిలు నేడు శిథిలావస్థకు చేరా యి. ఆ వంతెనలపై నుంచి వెళుతున్న వాహనాలు ఇప్పటికే పలుమార్లు ప్రమాదాల బారిన పడగా, పలువురు గాయాల పాలయ్యారు.
రామగుండంలో అభివృద్ధి చేస్తుంటే కొందరు నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని, ఇది సరైంది కాదని శివాజీనగర్ బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు సదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో వస్త్ర వ్యాపారులు, ప్లవర్ మర్చంట్, బుక్క దుకాణాదారులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆశ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
విద్యాశాఖకు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. 10, ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు విద్యార్థుల సంఖ్య పాఠశాలల్లో గణనీయంగా పెరిగింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచలకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాగార్డెనలో ఆత్మీయ సమావేశం జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషనపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. డీసీసీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చౌరస్తా నుంచి లక్ష్మీనగర్, కళ్యాణ్నగర్ మీదుగా మౌన ప్రదర్శన నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతుందని, మల్లేష్ ఏడు రోజులుగా చౌరస్తాలో నిరసన దీక్ష చేస్తున్నా అధికారులు, పాలకులు న్యాయం చేయడం లేదని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పేర్కొన్నారు. ఆర్.కే గార్డెన్స్లో శనివారం 245 మంది లబ్ధిదారులకు కోటి 7 లక్షల 57 వేల 756 రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం పోలీస్ కమిషరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు.
మహబూ బ్నగర్ రూరల్ మండల పరిధిలోని గాజులపేట గ్రామ శివారులో శని వారం సాయంత్రం బుగ్గ ఈరన్న గుట్ట దగ్గర బండరాయిపై చిరుత క నిపించింది.