వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులపై అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని నీరు గానీ, చల్లని పానీయాలు గానీ తాగాలనిపించడం సహజం. సల్సా షర్బత్, కూల్డ్రింక్లు, పండ్లరసాల దుకాణాలు కనిపిస్తే అప్రయత్నంగానే ఎక్కువ మంది కాళ్లు అక్కడ ఆగిపోతాయి.
బక్రీద్ పండుగ నేపథ్యంలో.. డిజిటల్ చెల్లింపుల (జీ పే, ఫోన్ పే, వంటివి) విషయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
మెట్రో రెండో దశ పనులపై నగరవాసుల ఆసక్తి పెరిగింది. తొలిదశకు సంబంధించి ఎల్అండ్టీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు పూర్తి కావడంతో త్వరితగతిన రెండోదశ పనులకు సంబంధించిన డీపీఆర్లను కేంద్రం ఆమోదించాలని సిటీజనులు డిమాండ్ చేస్తున్నానరు.
వేసవిలో బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నగరంలోని మైక్రో బ్రేవరీలలో గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరుగుతున్నాయి.
వేసవి దృష్ట్యా చర్లపల్లి- దానాపూర్ మార్గంలో వన్వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 13 జిల్లాల్లో 46డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ....
వైద్యం కోసం చంచల్గూడ్ జైలు నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ ఖైదీ.. ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. బాత్రూమ్ కిటికీలో నుంచి దూకి పారిపోయాడు.
భూమి సర్వే కోసం రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన ఓ మండల సర్వేయర్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.