నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్రోడ్డులోని మ్యాట్రిక్ ఎలకా్ట్రనిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్ దుకాణం పైఅంతస్తు పెంట్హౌజ్లో షార్ట్సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
వర్షం నీటి సంరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచయ్ జనభాగీదారి (జేఎ్సజేబీ) 3.0లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మునిసిపల్ చైర్పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి అన్నారు.
పోచంపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.
భూముల రీ సర్వేకు జిల్లాలో ప్రభుత్వం70 గ్రామాలను ఎంపిక చేసినట్లు డీఆర్వో రాజేశ్వరి తెలిపారు. మంగళవారం మంగపేటలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ మండలంలో ఐదు గ్రామాలు ఎంపిక చేయగా, అందులో మంగపేటలో రీసర్వే చేయనున్నట్లు తెలిపారు.
ఆషాఢ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గురు మౌఢ్యం కూడా బుధవారం ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగియనుంది.
వరుణుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని శంకరపట్నం మండలంలోని లింగాపూర్, ఎరడపల్లి గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడి గ్రామదేవతలకు మంగళవారం జలాభిషేకం చేశారు. మొదట మహిళలు బిందెలతో నీటిని తీసుకెళ్లి జలాభిషేకం చేశారు.
జిల్లాలో డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
చొప్పదండిలోని వంద పడకల ఆసుపత్రిలో పెండింగ్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కన గల పెట్ గోదాం వద్ద రైస్మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.