గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బంగ్లాదేశ్కు చెందిన వారు ఈ ప్రాంతాన్ని విడిచి పెట్టి పోవాలన్న స్పష్టమైన ఆదేశాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేయడంతో కొంత మంది కాగజ్నగర్ వైపు రావడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కాగజ్నగర్ ఈసుగాం ఎస్సై ఆధ్వర్యంలో క్యాంపులో 12లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో బంగ్లాదేశ్కు చెందిన ఎనిమిది మందిని గుర్తించారు.
మారుమూల గ్రామాల్లో సూపర్మార్కెట్ల తరహాలో వారసంతలు కొనసాగుతున్నాయి. వారసంతల్లో నిత్యావసర సామగ్రి మొదలుకొని అన్ని రకాల సామాగ్రి లభ్యం అవుతాయి. చిన్న పిల్లల ఆట వస్తువులు, మహిళల కాస్మోటిక్స్, దుస్తులు, వంట పాత్రలు తదితర సామాగ్రి అందుబాటులో ఉంటాయి. నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, సిర్పూర్(టి), దహెగాం, పెంచికలపేట, చింతలమానేపల్లి మండలాల్లో వారసంతలు కొనసాగుతున్నాయి. ఇది వరకు బాగానే ఉన్నా వారసంతల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి.
ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్కు వినతి పత్రం అందజేశారు. ఎస్పీఎం పునః ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి మిల్లును టేకోవర్ చేసిన జేకే యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. మిల్లులో 277 మంది పర్మనెంటు కార్మికులతో కలిపి సుమారు 2,188 మంది పని చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి భద్రత లేదన్నారు. లేబర్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోగా మిల్లు యాజమాన్యం ఎన్నికలు జరుగకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు.
కుమరం భీం జిల్లా కెరమెరి మండలం కోటారి గ్రామంలో జూన్ 1న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె హరిత అధికారులను ఆదేశించారు. కోటారి గ్రామాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, రాష్ట్ర ఇంజనీరింగ్ ముఖ్య అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం హెలిప్యాడ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లు సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. పంట సాగు కోసం రైతుల పంట పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాలు ముందస్తుగానే వచ్చేలా కనిపిస్తుం డడంతో రైతులు వానాకాలం సీజన్కు ముందుగానే పంట పొలాలలను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటు న్నారు. అకాల వర్షాల కారణంగా భూమిలో పదను ఉండడంతో దుక్కలు చేస్తున్నారు.
ఎబోలా వైరస్పై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎబోలా కేసులు లేవన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొంటూ.. అన్ని రకాల వడ్లకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నాలని సూచించిన మంత్రి.. అవశేషాల దహనం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
శంషాబాద్ సమీపంలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ స్కాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడి పాత్ర ఉందని ఆరోపించారు.