వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. టౌన్-2 సబ్డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో వినియోగదారుల సమస్యల వేదిక (లోకల్ కోర్టు)ను శనివారం నిర్వహించారు.
యాసంగి సీజన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణకు ప్రైవేట్ వలంటీర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలేదని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూ ర్లోని పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడారు.
విద్యార్థులు పరీక్షలంటే ఎటు వంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు.
మహిళా సమాఖ్య భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వయి హరీష్బాబు అన్నారు. మండలంలోని రెబ్బెన గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు శనివారం శంకుస్థాపన చేశారు.
పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక సంఘాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి అందే ఆదాయ వనరులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి శనివారం జిల్లా అధికారులు, పంచాయతీ రాజ్, రహదారి భవనాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణ ఉపాధి హామీ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, ఎంఈవోలతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెం ట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 335 పంచాయతీల్లో కేవలం 160 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కూలీలకు చేయూత కరవవుతోంది.
సన్ సిటి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..