నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఉదంతం అత్యంత బాధాకరం. విధి నిర్వహణలో ఒక మహిళా కానిస్టేబుల్పై ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజాన్ని కలిచివేస్తోంది.
నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠా.. ఎక్సైజ్ శాఖ సిబ్బందిపై దాడి చేసింది. కారును ఆపి తనిఖీ చేయాలని ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సహా ఇతర సిబ్బంది ప్రయత్నించగా, స్మగ్లర్లు కారును వేగంగా నడిపి పోలీస్ సిబ్బందిని ఢీకొట్టారు.
వైద్యం వికటించి రోగి మృతిచెందిన వార్తలు మనం చూస్తునే ఉంటాం. కానీ ఒకే పేరున్న మరో రోగికి ఇచ్చే మందులను పొరపాటున ఆ రోగికి మందుల చీటీలో రాసివ్వడం వల్ల ఒక వృద్ధుడు మృత్యువాత పడ్డారు. అసలేం జరిగిందంటే...
కాామారెడ్డి జిల్లాలో ఓ బాలుడు కైట్ ఎగరవేస్తూ భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు.
బెట్టింగ్ యాప్ల బారిన పడి.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫాంహౌస్ నీటి తొట్టిలో ప్రమాదవశాత్తూ పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ మహిళ లక్షలు పోగొట్టుకుంది. ఓ యాప్ను నమ్మి డబ్బులు పెట్టింది మహిళ. చివరకు ఉన్న డబ్బులు స్వాహా అవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది.
కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.