శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాగా, ఈ నేపథ్యంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
భువనగిరి బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. 14 స్థానాలకు నాలుగింటికి నామినేషన్లు దాఖలుకాలేదు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని కలెక్టర్ అనురాగ్జయంతి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
అమెరికా-ఇరాన్కు యుద్ధ నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్టు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో వారు మాట్లాడారు.
మిల్లర్ల వద్ద ఉన్న టెండర్ ధాన్యం లోటును రికవరీ చేయాలనే సీఎం ఆదేశాల అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మిల్లర్ల వద్ద ఉన్న రూ.39 వేల కోట్ల విలువైన ధాన్యం రికవరీ చేయాల్సిందేనని, అందులో ఎవరి ఒత్తిళ్లకు కలెక్టర్లు లొంగవద్దని ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలిచ్చినా అందుకు అవసరమైన కార్యాచరణ అమలులో అధికారయంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది.
ఎండలు ముదురుతున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు ఓ వైపు.. మరోవైపు ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి.. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్నారు.
సూర్యాపేట రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కేంద్రం శివారు దాసాయిగూడెం సమీపంలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో విష వాయువు పీల్చి నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు
దేవరకొండ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ జంట నగరాలతో పాటు జి ల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాలువ మరమ్మతుకు ఎట్టకేలకు మో క్షం లభించింది.
యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్టకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు.