సమాజ సేవపై ఆసక్తి ఉన్న వారిని గుర్తించి రెడ్క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేర్పించాలని రెడ్క్రాస్ జిల్లా చైర్మన డాక్టర్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి కోరారు.
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన) : భువనగిరి జిల్లా ఆసుపత్రికి వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. అస్తవ్యస్త పార్కింగ్తోనే అం బులెన్సల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతున్నదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.
మునిసిపాలిటీలోని దివీస్ సంస్థ ఉత్తమ నిర్వహణ, కార్మికుల సంక్షేమానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నిమ్మతోటతో పాటు కొట్టం అందులో ఉన్న నిమ్మకాయలు కాలి బూడిదయ్యా యి. స్థానికులు, బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారులో కంచర్ల వివేకానందరెడ్డికి సం బంధించిన నిమ్మతోటను తిప్పర్తి గ్రామానికి చెందిన నూ కల విజయ్ సాగు చేస్తున్నాడు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామశివారులోని నోష్ ఫార్మా ల్యాబ్లో శుక్రవారం రియాక్టర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
చౌటుప్పల్ పట్టణంలోని 10వ వార్డు బీసీ కాలనీలో 20 సంవత్సరాల క్రితం చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి.
నల్లగొండ జిల్లాకేంద్రంలో హైదరాబాద్ ఔటర్రింగురోడ్డు తరహాలో నల్లగొండ జిల్లా కేంద్రం చుట్టూ 545వ జాతీయరహదారిలో భాగంగా నిర్మిస్తోన్న నాలుగు వరుసల బైపా్సరోడ్డు నిర్మాణం వేగవంతంగా సాగుతోంది.
యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయింపులో ప్రభుత్వం కొత్తగా అమ ల్లోకి తెచ్చిన జీపీఎస్ విధానంతో పాటు ఆటో మెయిల్ ట్యాగ్ను ఉపసంహరించుకుంది. తూకం వేసి ధాన్యం మిల్లులకు రవాణా చేసిన తర్వాత మిల్లర్లు తాలు, తేమ నాణ్యత పేరిట పెడుతున్న కొర్రీలు, కోతల నుంచి రైతుల ఉపశమనం కోసం అమల్లోకి తెచ్చిన జీపీఎస్ విధానం నిలిచింది.
లావాదేవీల్లో డిజిటల్ పే మెంట్స్ జోరు కొనసాగుతోంది. కిరాణా దుకాణంలో రూపాయి కొను గోలు మొదలు ఎలక్ర్టానిక్, జ్యూయెలరీ షాపుల్లో లక్షల విలువైన బిల్లులు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా కండక్టర్ వద్ద ఉండే క్యూఆర్ కోడ్కు ప్రయాణికులు స్కాన్ చేసి టికెట్లు పొందుతున్నారు.