ఎండల తీవ్రత కారణంగా చికెన్ ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. నాలుగైదు రోజుల క్రితం వరకు సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా రెట్టింపైంది. కిలో రూ.190 నుంచి రూ.210 పలికిన ధర ఏకంగా రూ.320 నుంచి రూ.340 వరకు ఎగబాకింది.దీంతో సామాన్యుడికి చికెన్ తినడం అనేది విందుభోజనంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రాను న్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. వానాకాలం సీజన్లో 6లక్షల ఎకరాలకు పైగా వరి సాగుకానుండగా, 5.60లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతతో బుగ్గమాదారం వద్ద చేపట్టిన రాజీవ్గాంధీ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై ఏడాది గడుస్తున్నా పనుల్లో వేగం అందు కోవడం లేదు.
తెల్లవారితే తొలి ఏడాది పెళ్లి రోజు, అందులోనూ భార్య గర్భవతి. ఇల్లంతా సందడిగా ఉండాల్సిన సమయంలో విషాదం నెలకొంది. బంధువుల శుభకార్యానికి హాజరై వస్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు.
నల్లమల అడవిలోని వన్యప్రాణులు, అటవీ జంతులు ఎండవేడిమికి అల్లాడిపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి, దేవరకొండ అటవీ పరిధిలో అటవీ శాఖ ఏర్పాటుచేసిన నీటితొట్లు, గుంతలు, చెక్డ్యాంల వద్దకు వచ్చి దాహాం తీర్చుకుంటూ ఆ నీళ్లలో సేదతీరుతున్నాయి.
వేసవి సెలవులను విద్యార్థులు, చిన్నారులు వృథా చేయకుండా ఏదో ఒక వ్యాపకంలో నిష్ణాతులయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తోంది.
పాలకవీడు, మే 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణానదిపై రూ.303 కోట్లతో నిర్మిస్తున్న జానపహాడ్ జవహర్ ఎత్తిపోతల పథకం పనులు మమ్మురంగా సాగుతున్నాయి.
డిజిటల్ మాయలో పడి నలుగురితో కలవడం మరచిపోతున్న నేటి తరం పిల్లలు, మొబైల్ఫోన్లను పక్కన పెట్టి మట్టి ఆటల వైపు మొగ్గు చూపుతున్నారు.
నిన్న మొన్నటి వరకు సొంతంగా ఇల్లు లేని వారు ఇరుకు గదుల్లో, అద్దె ఇళ్లలో ఉంటూ పడరాని పాట్లు పడుతూ వచ్చారు.
జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు గృహగణనకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.