జిల్లాతోపాటు జనగామ జిల్లాతో కలిపి మొత్తం 25వేల ఎకరాలకు దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ-6 ద్వారా వానాకాలం సీజన్కు గోదావరి జలాలు అందనున్నాయి.
కొత్తగా చేయూత పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది. ఈ నెల15వ తేదీ నుంచి పింఛన్ల మం జూరుకు శ్రీకారం చుట్టనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈమేర కు జిల్లా అధికార యం త్రాంగానికి ఆదేశాలు సైతం జారీ కావడంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
నల్లగొండ జిల్లా చెరువుగట్టు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుట్ట కింద ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత తీవ్రరూపం దాల్చి.. 10కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం భువనగిరిలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
దినదినాభివృద్ధి చెందుతోన్న సూర్యాపేట పట్టణానికి రైల్వేమార్గం చిరకాలవాంఛ. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఈ పట్టణం ఉంది. జిల్లాకేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ ప్రాంత ప్రజలకు రైల్వేమార్గం తీరనికోరికగా మిగిలిపోతోంది.
వాళ్ల తాతలు, తండ్రులు, వాళ్లూ పుట్టి పెరిగింది అక్కడే. బంధువులు, మిత్రులు, తోటి స్నేహితులంతా కలిసి ఒకే కు టుంబంలా జీవిస్తున్నారు. సజావుగా సాగుతున్న వారి కుటుంబాల్లో ఆధునికీకరణ పేరుతో పిడుగులాంటి వార్త వచ్చిపడింది. మీరుండే ఇళ్లు, స్థలాలు మీ వి కావు. ఇక్కడి నుంచి వెళ్లిపోండని నోటీసులు వచ్చాయి. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా బతుకీడుస్తున్నారు.
విద్యార్థుల కడుపు నింపేందుకు మధ్యాహ్న భోజన ఏజె న్సీ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు.. ప్రభుత్వం చెల్లించే బిల్లులు ఏమాత్రం పొంతన లేకపోవడంతో వంట చేయడం ఆర్థిక భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలేరు నియోజకవర్గంలో పీఏసీఎ్సలను బలోపేతం చేస్తానని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో కీలక నేతల నడుమ కోల్డ్వార్తో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల నియామకాల్లో జాప్యంపై కార్యకర్తల్లో అసహనం నెలకొంటోంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో డీఎస్పీ పోస్టు సైతం నెలన్నర రోజులుగా అధికారిని నియమించలేని పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియకు జిల్లా సంక్షేమ, మహిళ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.