దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. అనంతరం బతుకమ్మ పండగ విశేషాలను ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.
గత 5 ఏళ్లగా అమీన్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీవాని నగర్ వేదిరి టౌన్ షిప్లో నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు.
తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమడక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళపైకి ఆయిల్ ట్యాంకర్ వేగంగా దూసుకువెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
నల్లకుంట చెరువు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయింది. దీంతో చుట్టు పక్కల ఉన్న వందల ఎకరాలలో పంట పొలాల్లో ఎరుపు రంగునీరు వచ్చి చేరింది.
Telangana Prajapalana: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం సకలజనులు పోరాడారని గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. దీంతో సంగారెడ్డి ప్రజలు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.