మున్సిపల్ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా కూడా విడుదల కావడంతో.. వారు ఇక సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని ప్రచారాలను ప్రారంఢించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.
సంగారెడ్డి జిల్లా జగదేవ్పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడానికి సిట్ పేరిట కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ను వేధించడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు..
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొదటి రోజు 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్ - 12, నర్సాపూర్ - 3, తూప్రాన్ - 4, రామాయంపేట- 7 నామినేషన్లు వచ్చాయి
సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.
సంగారెడ్డి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. సదరు యువకుడికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్టాప్లో ఉన్న ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. పటేల్గూడ బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.