పటాన్చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డి.. సైబర్ నేరగాళ్ల చేతిలో భారీ మోసానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి మొత్తం రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు.
సంక్షేమ శాఖలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు వేయడమే తప్ప.. నిధులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
రాబోయే 2027 గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్లైన్స్ రోడ్డు ఉన్న హుస్నాబాద్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని.. డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా సదాశివపేట మండలం మెలిగిరిపేట గ్రామ శివారులో కొందరి రైతుల పంట పొలాల్లో 20 మొసలి పిల్లలు కనిపించిన ఘటన కలకలం రేపింది.
మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి, ప్రయాణికుల నుంచి ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించినా ఇందులో కొందరు అర్హులకు మాత్రం చోటు దక్కలేదు. కుటుంబాలను పట్టించుకోకుండా ధూంధాం ప్రదర్శన పేరిట ఊరూరా తిరిగిన కళాకారులకు నిరాశే ఎదురైంది.