బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మకి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆయుధ పూజను నిర్వహించారు.
గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్ తెస్తే ప్రత్యేక సమావేశల ద్వారా ఆ క్యాప్ తొలగిస్తూ చట్టం చేసి గవర్నర్ దగ్గరకు పంపించడం జరిగిందని మంత్రి పొన్నం అన్నారు. గవర్నర్ దానిని ఆమోదించలేదని.. ఆ బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు.
తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో నడవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దశదిశను నిర్దేశించిందని చెప్పుకొచ్చారు.
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొండపాక మండలం మర్పడ్గ శ్రీ విజయ దుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జునస్వామివారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. అనంతరం బతుకమ్మ పండగ విశేషాలను ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం ధాటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు. వాన దంచికొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.
గత 5 ఏళ్లగా అమీన్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ప్రకాష్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీవాని నగర్ వేదిరి టౌన్ షిప్లో నిలిచినపోయి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో భాగంగా విద్యుత్ స్తంభంపైకి ఎక్కాడు.
తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమడక అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఉద్ఘాటించారు. ఇవాళ(ఆదివారం) సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు.
సంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న మహిళపైకి ఆయిల్ ట్యాంకర్ వేగంగా దూసుకువెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.