ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోవడంతో ఉల్లి రైతు కన్నీరు పెడుతున్నాడు.
పారిశ్రామిక ప్రాంతాలు కాజీపల్లి, గడ్డపోతారం పరిధిలో చిరుత సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తుండగా.. గురువారం దూడ పై దాడి చేసి చంపివేసిన ఘటన కార్మిక వర్గలు, స్థానిక గ్రామాలలో కలకలం రేపింది.
స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయస్థాయిలో అనేక అవార్డులు పొందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణాన్ని కోతులు, కుక్కలు, పందులు వణికిస్తున్నాయి. పట్టణంలో ఎక్కడచూసినా ఇవే దర్శనమిస్తాయి.
మెదక్ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పట్టణం నడిబొడ్డున ఉన్న రాందాస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు పేడ పూసి పరారయ్యారు.
వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పరిధిలో జాతీయ రహదారి-65పై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ రోడ్డును లింగంపల్లి నుంచి సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరు వరుసలుగా విస్తరించే పనులు కొనసాగుతున్నాయి.
కోతుల బెడదను అరికట్టేందుకు కోహెడ మండలం నకిరేకొమ్ములలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.
ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పండించిన పంట చేతికి వచ్చే సరికి రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి.