రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ వద్ద టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల మధ్య ఘర్షణలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కండక్టర్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రూ.20 వేలు లంచం అడిగినట్లు ఇన్స్పెక్టర్పై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీ టికెట్ ఇన్స్పెక్టర్ను కండక్టర్, ప్రయాణికులు చెప్పులతో కొట్టడం సంచలనం రేపింది. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించిన వ్యక్తితో పాటు కండక్టర్ను ఆర్టీసీ అధికారి లంచం అడగటంతో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. ఆస్తి పన్ను తగ్గించడానికి బిల్లు కలెక్టర్ ఒక వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతులు, రాష్ట్ర ప్రజల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఎవరు మాట్లాడితే వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తల్లిదండ్రులూ... మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? పని ఒత్తిడిలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఉన్నత చదువుల కోసం పట్టణాలకు పంపిస్తున్నామని మీరు సంబరపడుతుంటే.. కొందరు విద్యార్థులు మాత్రం దారి తప్పి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువని... అవకాశవాదం ఎక్కువని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు.