సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువుకట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్సే కారణంగా తెలుస్తోంది.
పఠాన్చెరు పారిశ్రామికవాడ రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉందని.. పూర్తిగా జలమయం అయిందని మంత్రి పొన్నం తెలిపారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం దెబ్బతిన్నదని.. కొట్టకుపోయిందని అన్నారు.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ విజయదుర్గ అమ్మవారికి స్వర్ణ కిరీటధారణ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువు శంకరాచార్యులు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కట్టు, బొట్టుకు తెలంగాణ ప్రసిద్ధి అని పేర్కొన్నారు.
10 ఏళ్లు అధికారంలో ఉండి అలా అనడం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి. ఒక మాజీ ఎమ్మెల్యేతో తనను తిట్టించడం దారుణమని మండిపడ్డారు. హరీష్ భజన మండలితో తనను తిట్టించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో వృద్ధ దంపతులు గొడుగు పోచయ్య, యాదవ్వ నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు యాదగిరి, రమేశ్, ఓ కుమార్తె ఉంది.
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దీపూర్ గ్రామానికి సునీత అనే మహిళకు దేవాన్ష్, రహస్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ సంఘం తరపున తనకు వచ్చే డబ్బులు తీసుకునేందుకు గ్రామంలోని కెనరా బ్యాంకు(Canara Bank)కు సునీత వెళ్లారు. దసరా సెలవులు కావడంతో సునీత తన ఇద్దరి పిల్లలను సైతం బ్యాంకుకు తీసుకెళ్లింది.
సైబర్ నేరగాళ్లు చేసే మోసాలపై పోలీసులు, ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న పలువురు బాధితులు మోసపోతునే ఉన్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ ఐటీ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు.
వచ్చే ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎందుకంటే..