Home » Telangana » Mahbubnagar
పర్యాటకులు ఆకాశమార్గంలో ఆనంద విహారం చేయనున్నారు. హెలిక్యాప్టర్లో ప్రయాణిస్తూ నాగర్కర్నూలు జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణానది సోయగాలు, దట్టమైన నల్లమల అడవులను తిలకించనున్నారు.
ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల నిమిత్తం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్కు నష్టం జరుగకుండా ముందస్తు సమాచారం ఇవ్వడం సీబీయూడీ (కాల్ బిఫోర్ యు డిగ్) యాప్ ముఖ్యఉద్దేశం అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పంపిణీ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావాలని బావా బామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు.
ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఫుడ్ పాయిజన్ అయితే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రజలు కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.
మ హబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవం కోసం సహకరించామని, ఆ కృతజ్ఞత కూడా లే కుండా తమ పార్టీ కార్పొరేటర్లను బ్లాక్మెయిల్ చే యడం దారుణమని మాజీమంత్రి వి శ్రీనివా్సగౌడ్ అన్నారు. ఇలాంటి రాజకీయాలకు భయపడబోమని చెప్పారు.
పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి 2024-2025 ఏడాది పెండింగ్ డబ్బులు రూ.65 లక్షలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని పది స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా నిర్మించాలని భావిస్తున్న గొల్లపల్లి రిజర్వాయర్ చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం ప్రాజెక్టుకు మంజూరు ఇవ్వకముందే కమీషన్లు, వాటాల వరకు మాటల తూ టాలు పేలుతున్నాయి.