దక్షిణ అయోధ్యగా పిలుచే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.
భద్రగిరిలో శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే మహా పట్టాభిషేకం కార్యక్రమాలను ఎలాంటి లోటుపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పూర్తిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సి పాలిటీ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమార్కులు ఇసుక డంప్ల మాదిరిగానే పదుల సంఖ్యలో మట్టిని కూడా డంప్ చేస్తున్నారు.
రైతులకు పెట్టుబడిసాయంగా అందజేస్తున్న రైతుభరోసా సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఖాతాల్లో జమచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
భద్రాచలంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆలయంలో గురువారం నుంచి వసంత పక్ష తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా అభిషేకం, ఆరాధన, తిరుమంజన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
ఖమ్మం జిల్లాలోని వల్లభి బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఒక బాలిక మరణం జిల్లాలో కలకలానికి దారి తీసింది. ఆశ్రమ పాఠశాల సిబ్బందే తమ బిడ్డ మరణానికి కారణమని బాలిక కుటుంబసభ్యులు ఆరోపించారు.
ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ(బుధవారం) ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.