Home » Telangana » Karimnagar
రెండేళ్ల పాలనలో ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్, హరీష్రావు, మహిపాల్రెడ్డి ఆఫీసులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆఫీసు పై దాడి చేయటాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
సింగరేణి సంస్థ నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నట్టు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం యూనియన్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహనీయుల ఆశయాలను మనమంతా ముం దుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. ఆదివారం షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో నిర్వ హించిన డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి వేడుకల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పాల్గొన్నారు.
వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు రోజుకావడంతో భక్తులు పోటెత్తారు.
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం అర్ధరాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది.
జిల్లాలోని వస్త్ర పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో మద్దతు అందిస్తుందని ఎన్పీడీ సీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు.
దేశ మాజీ ఉప ప్రధాని, దివం గత బాబు జగ్జీవన్రామ్ స్ఫూర్తితో ముందుకువెళ్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పోలీసు రికార్డుల ప్రకారం సరాసరి రోజుకు రెండు ప్రమాదాలు, ఇద్దరు గాయాలపాలవుతున్నారు. అనధికారికంగా ప్రమాదాల సంఖ్య, గాయపడినవారి సంఖ్య నాలుగురెట్లు ఉంటుంది.
మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ పదవికి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అందరి దృష్టి ఆ పదవుల వైపు మళ్లింది. ఇంతకాలం నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో మున్సిపాలిటీలో నలుగురికి అవకాశం లభించనుంది.
అందరిదీ ఒకే మాట.. ఒకటే తీర్మానం.. సెస్ను పరిరక్షించుకోవాలి.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ యథావిధిగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ద్వారా జరగాలి.. విద్యుత్ సరఫరా కోసం లైసెన్స్ రెన్యూవెల్ వెంటనే చేయాలంటూ సెస్ గ్రామ ప్రతినిధులు డిమాండ్ చేశారు.