Home » Telangana » Karimnagar
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం మరో నెల రోజుల పాటు కొనసాగునున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ పథకం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కావలసి ఉండగా, దీనిని ఆయా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండడం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరుగనుండడంతో పథకం అమలును ఒక నెల వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామంలోని ఒకే కులానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారితీయగా ఈ కేసులో నిందితులైన 15 మందికి జీవితఖైదుతోపాటు రూ.1,500 చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు.
రాష్ట్రంలో డిజిటల్ విధానంలో జరిగే మొదటి జనగణన 2027లో మాస్టర్ ట్రైనర్లు కీలకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. ఈదురు గాలులతో మొదలైన వర్షం ఉధృతరూపం దాల్చింది. దీంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రజలు ఇబ్బందిపడ్డారు.
సిరిసిల్ల బల్దియ బడ్జెట్పై నూతన కౌన్సిల్ ఎంతో ఉత్సాహంగా చర్చలు జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలకు మరింత శక్తి వచ్చిందని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
చైత్ర శుద్ధ పౌర్ణమి, గురువారం హనుమాన్ చిన్న జయంతిని జరుపుకోనున్నారు. త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే ఈ రోజును హనుమాన్ వీరోచిత, విజయోత్సవ దినంగా, శ్రీరాముడు ఆంజనేయుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు.
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా అమలుచేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడు తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం ప్రజలకు మంచినీరు ఇవ్వడం చేతకాక ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని, కౌశిక హరి ఒక సైకోలా తిరుగుతున్నాడని మేయర్ మహం కాళి స్వామి విమర్శించారు. మంగళవారం గోదావరి ఖని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మేయర్, కార్పొరేటర్లు మాట్లాడారు