Home » Telangana » Karimnagar
ధాన్యం కొనుగోలు సవాల్గా మారింది. అన్లోడింగ్ ఇబ్బందులు, మిల్లుల్లో స్థల సమస్య, కేంద్రాలలో నిర్లక్ష్యంగా కొనుగోళ్లు, లారీల కొరత, కటింగ్ వంటి అనేక అంశాలు రైతులు, అధికారులకు, మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సీజన్లో వరి పంటలకు ఎలాంటి తెగుళ్ళు సోకకుండా ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చాయి.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ కార్యక్రమంతోపాటు సంస్థాగత నిర్మాణంపై కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన కార్యాలయంలో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అన్ని అంశాలపై సుధీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతీ యేటా ఆసుపత్రుల నిర్వహణ, చిన్న మరమ్మతులు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ బిల్లులు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, అత్యవసర ఔషధాల కొనుగోలు వంటి అవసరాలకు ఇవ్వాల్సిన హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ (హెచ్డీఎఫ్) సమయానికి విడుదల కాకపోవడంతో పీహెచ్సీల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ప్రభావం పేద, మధ్యతరగతి కుటుంబాలను వెంటాడుతూనే ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సతమతమవుతున్న కుటుంబాలకు పెట్రోల్, డీజిల్ మంట అంటుకుంది. యుద్ధ ప్రభావంతో గ్యాస్ భారం మోస్తున్న సామాన్యుల బతుకు బండిపై కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారాన్ని పెంచింది.
రాష్ట్రంలోని గూడు లేని ప్రతి కుటుంబానికి గూడు కల్పించి పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక-99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 18 నుంచి మే 23వ తేదీవరకు నిర్వహించనున్న యువజన, క్రీడా వారోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశిం చారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని మధ్యాహ్న భోజన కార్మికులు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో శనివారం ధర్నా కార్య క్రమం చేపట్టారు.
సిరిసిల్ల నుంచి హైదరా బాద్కు అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నాయకులు ధర్నా చేపట్టారు.
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శ కంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అంతరాష్ట్ర సాయుధ ముఠాలు బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో శనివారం బ్యాంక్లు, జ్యువెలరీ షాపుల ప్రతినిధులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.