Home » Telangana » Karimnagar
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధత, శాంతిభద్రతల పరిరక్షణపై కీలక సూచనలు చేశారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండల కేంద్రంలో నియోజకవరానికి చెందిన 4,916 స్వశక్తి సంఘాలకు 4.76 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
రోడ్డు భద్రత నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
రామగుం డం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయం ముట్టడికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునివ్వడంతో మంగళ వారం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చందర్తో పాటు పలువురు నాయకులు మంగళవారం ఉదయమే కళ్యాణ్నగర్ చౌరస్తా వద్ద వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్స్టేషన్కు తరలిం చారు.
రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో మంగళవారం రాత్రి గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు.
రామగుండానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బోనంజా ప్రకటించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రూ.17వేల కోట్ల పెట్టుబడులతో రెండు విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. జీవిత కాలం ముగియడంతో మూతబడిన బీ థర్మల్ స్థానంలో ఎన్టీపీసీ సహకారంతో 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
నగరంలోని వాణిజ్యసముదాయాలు, కమర్షియల్ బిల్డింగ్స్లో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఆయా వాణిజ్య సముదాయాలు, బిల్డింగ్స్కు సంబంధించిన వాహనాలను పార్కింగ్ చేసేందుకు వదిలిపెట్టాల్సిన సెల్లార్లను దర్జాగా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి గెజిట్ జారీ చేశారు. గెజిట్లో పొరపాట్లు ఎలా ఉన్నా బీసీల ఆశలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చాలీచాలని సొమ్ముతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు కాస్త తీరనున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం వంట ధరలు పెంచాలని నిర్ణయం తీసుకోగా విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.