Home » Telangana » Karimnagar
ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రతిఓటర్కు ఇందులో అవ కాశం కల్పించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆదేశించారు. మల్యాల మండలం సర్వాపూర్లో ఎస్ఐఆర్ పత్రాల పంపిణీని శుక్రవారం ఆమె పరిశీలించారు.
జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఏర్పా టు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి తక్షణమే 10ఎకరాల స్థలం కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.
ఒక్కో విద్యార్థి - ఒక్క మొక్క అనే నినాదాన్ని ఆచరణలో పెట్టాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖని సెక్రడ్ హార్ట్ హైస్కూల్లో ఏకో క్లబ్ను మేయర్ ప్రారంభిం చారు.
విద్యార్థుల భవిష్యత్తో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జీవో 17ను రద్దు చేయాలంటూ రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టారు.
మండలంలోని అభివృద్ధి పనులను ఈ నెలాఖరు వరకు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఓదెలలో కలెక్టర్ మాట్లాడుతూ, నిరుపయోగంగా ఉన్న ఐకేపి భవనంలో సివిల్ కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా, వినియోగించుకునే విధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రామగుండం నియోజక వర్గంలో ఓటరు జాబితాలో ప్రతీ అర్హుడి పేరు నమోదయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సర్, బీఎల్ఏ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఆర్టీసీ ఎలకి్ట్రక్ బస్సులు భయపెడుతున్నాయ్... వరుస ఘటనలతో ప్రయాణీకులు, ఆర్టీసీ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
నల్ల రేగళ్లలో తెల్ల పూలు పూయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు..
రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందించడం, ధాన్యం కొనుగోలు, పెట్రోల్ బంకుల నిర్వహణతోనే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెడుతున్నాయి.
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి.