Home » Telangana » Karimnagar
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రునికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారు. దాదాపు రెండు గంటల పాటు క్షతగాత్రుడు విలవిలలాడాడు. రోగి అవస్థను చూసి అక్కడ ఉన్న మిగతా వారు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాశివరాత్రికి గోదావరిఖనిలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. కోదండ రామాలయంలో శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ చేతికి వెళ్తుందా లేదా కాంగ్రెస్కా? అనే విషయానికి దాదాపు తెరపడింది. కార్పొరేషన్లో గెలిచిన ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బీజీపీ గూటికి చేరారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు వేడెక్కాయి. భారతీయ జనతా పార్టీని నిలువరించడమే లక్ష్యంగా ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఒక అరుదైన, ఆసక్తికరమైన మలుపుగా మారింది.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అను బంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శనివారం నుంచి ఈ నెల 16వరకు నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా విస్తృత ఏర్పా ట్లు చేశారు.
వేములవాడలో శనివారం నుంచి ఈనెల 16వరకు మహాశివరాత్రి వేడుకలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేశామని ఇన్చార్జి కలెక్టర్ గరి మ అగ్రవాల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన, దౌర్జన్యాలకు పాల్పడిన సిరిసిల్ల పట్టణ ప్రజలు బీఆర్ఎస్ మెజార్టీ అభ్యర్థులను గెలిపించడం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
నర్సా పూర్లో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలం గాణ గ్రామీణ బ్యాంకు నర్సాపూర్ శాఖ ఆధ్వ ర్యంలో సదస్సులో బ్యాంకు అధికారులు ఖాతాదారులకు సైబర్ క్రైమ్ మోసాలపై వివరించారు.
ఓదెల శైవక్షేత్రంలో శుక్రవారం బ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిం చారు. ఆలయంలో అర్చకులు ఉదయం పూజలు నిర్వహించిన తర్వాత నూతన వధూవరులు భ్రమ రాంబ మల్లికార్జునస్వామిని కల్యాణ వేదికపై ఆసీనులు చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవ మూర్తులకు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని, వైద్యులు సమయపాలన పాటించా లని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్ర వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసు పత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు.