దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. స్పేస్ సెక్టార్లో కో-ఆపరేటివ్, ఎకో సిస్టమ్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు.
గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2019 సెలెక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
బీజేపీలో పాత కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తలను ఎన్నికల్లో నిలబెట్టి వారి విజయం కోసం పార్టీ పెట్టుబడి పెట్టాలని ఆకాంక్షించారు.
జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్కు చెందిన మదివాలా మచ్చదేవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమైంది. ఇవాళ తొలి దశ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవి దేవి విచారణ జరిపి..రేపటికి వాయిదా వేశారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో జనం బాట కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ చనిపోకపోయినా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక వచ్చేదని అన్నారు.
ఐటీ కంపెనీ అంటూ హడావుడి చేశారు. మంచి కోర్సులకు శిక్షణ ఇచ్చి తమ కంపెనీలోనే ఉద్యోగాలు ఇస్తామంటూ దాదాపు 400 మంది విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఇలా మొత్తం 12 కోట్ల రూపాయల వరకూ దోచేసి, రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంపై బీఆర్ఎస్ నేతలు అనవసరంగా బురద జల్లుతున్నారంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. తాము ఎంతో నాణ్యమైన చీరలు అందజేస్తున్నా.. అవి బాగాలేవని ప్రజల్లో దుష్ప్రచారం కల్పించడం తగదన్నారు.