తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ట్రస్టు ఏర్పాటు చేసింది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి పలువురిపై ఫిర్యాదు చేశారని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్లపై ఫిర్యాదు అందిందన్నారు.
పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో పక్షపాతం చూపారని మండిపడ్డారు
హైదరాబాద్లోని కవాడిగూడలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేశాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని లులు హైపర్ మార్కెట్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి హాని కలిగించేలా ఉన్న 150 కిలోల ఆహార పదార్థాలను వారు స్వాదీనం చేసుకున్నారు.
సినిమా షూటింగ్ ఆశచూపి ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు నివసిస్తున్నారు.
హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.
దాదాపు 10 రోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. మరోవైపు వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం నుంచి 23వరకు రాష్ట్రవ్యాప్తంగా వడగాడ్పుల తీవ్రత పెరగనున్నట్లు హెచ్చరించారు.
శంషాబాద్ పరిధిలోని ఘాన్సీమియాగూడాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి తెగబడ్డారు.