కోకాపేటలోని భూములకు ఈ వేలం ఈ రోజు కొనసాగింది. శుక్రవారం ఈ భూములకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151. 25 కోట్ల ధర పలికింది.
2009 నవంబర్ 29వ తేదీన నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ దీక్షపై పలువురు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో.. గడువు తీరిన 50 మందికిపైగా నైజీరియన్లు ఉన్నట్లు గుర్తించి.. వారిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్నం తదితర నగరాల్లో కీలక నిందితులను సై అరెస్ట్ చేసింది.
పంట నష్ట పరిహారం విషయంలో విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ముసాయిదా విత్తన బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు గట్టిగానే తెలుపుతామని హెచ్చరించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది.
మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి సంబంధించి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ రాసింది. పోలీసుల అదుపులోనే దేవ్ జీ ఉన్నారని ఆరోపించింది.
గన్ మిస్సింగ్ కేసులో అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గన్ ఎక్కడపెట్టానో తెలీదంటూ ఎస్ఐ చెబుతున్నట్లు సమాచారం.
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.