హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన ఎన్సీఓలను త్వరగా జారీ చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సంబంధిత అధికారులను కోరారు.
హైదరాబాద్లోని పూల్బాగ్లో జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు తెలంగాణ పాలిట ముప్పుగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలు కట్టగా మిగిలిన నగదుతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు.
హెచ్- సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.1300 కోట్ల వ్యయంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వన్ వే కి సహకారం అందిస్తున్నందుకు సీపీ సజ్జనార్ ధన్యవాదములు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి హరీశ్రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శలు గుప్పించారు. హరీశ్రావు కాదు ఆయన అబద్దాల రావు అని ఎద్దేవా చేశారు.
తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ పోలీసులు వన్వే అమలు చేయడంతో వాహనదారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. దారి తెలియక కొందరు రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు.