తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్ను ప్రారంభించారు.
దేశంలోనే తొలిసారిగా ఈడీ ఈ-వేలం ద్వారా ఓ విమానాన్ని విక్రయించింది. జులై 1న ఆక్షన్ నిర్వహించగా రూ.3 కోట్లకు సదరు విమానం అమ్ముడుపోవడం విశేషం.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు.. మంత్రి జూపల్లి కృష్ణారావుకు బహిరంగ లేఖ రాశారు. ఆర్బీఐ గణాంకాలు, అసెంబ్లీలో చేసిన ప్రసంగాల వీడియోలను వాట్సాప్ ద్వారా పంపినట్లు వెల్లడించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలన్నారు.
తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు సిద్ధమయ్యారు. సోమాజీగూడ ప్రెస్క్లబ్లో చర్చకు సిద్ధమని.. సాయంత్రం 5 గంటలకు వస్తానని బీఆర్ఎస్ నేతలకు మరోసారి సవాల్ విసిరారు.
మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో రైలు కిందపడి దంపతులు మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీషగా గుర్తించారు.
హైదరాబాద్ లంగర్హౌస్ పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలిని రేణుకగా పోలీసులు గుర్తించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్-షాలిమార్ (కోల్కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.