దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి సీఎం నివాళులర్పించారు.
మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మహిళా వారోత్సవాలు’ నిర్వహించనుంది.
పాతబస్తీ మదీనా సమీపంలోని ఎస్వైజే కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం ఈ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి.
సీఎం మనిషిని.. కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ ఖరీదైన కార్లలో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడు సంతోష్ కుమార్ గుప్తా ఆటను మేడ్చల్ పోలీసులు కట్టించారు.
ఐపీఎల్ నకిలీ టికెట్ల మోసాలపై క్రికెట్ అభిమానులను టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) అప్రమత్తం చేసింది. సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ టికెట్లను కేటుగాళ్లు విక్రయం చేస్తారని హెచ్చరించింది.
సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఐటీ రంగాన్ని హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాలకు విస్తరించే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs) ఏర్పాటు చేసే సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హైగ్రేడ్ గంజాయి పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని గుర్తించిన అధికారులు వారిని అరెస్టు చేశారు.
అత్తాపూర్లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసింది. ఎట్టకేలకు యువతిని పోలీసులు ట్రేస్ చేశారు. మలక్పేట్లోని తన ఇంట్లోనే యువతి సేఫ్గా ఉన్నట్లు తెలిపారు.
పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్సీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.