హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్తను భార్య చున్నీతో గొంతు బిగించి చంపేసింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక స్టే ఎత్తివేసింది తెలంగాణ హైకోర్టు. ఈసీ, కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది.
డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..
హైదరాబాద్లోని బేగంబజార్లో వెలుగులోకి వచ్చిన గంజాయి పాల ఉదంతం నగరవాసులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా యువతను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు..
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టైన డా. నమ్రతను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హవాలా, మనీలాండరింగ్కు సంబంధించిన కీలక అంశాలను వెలికితీయడానికి కస్టడీ అవసరమని ఈడీ అధికారులు పేర్కొన్నారు..
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
మున్సిపల్ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. త్వరలోనే ప్రతి జోన్లో పర్యటిస్తానని.. రోడ్డు శుభ్రంగా లేకపోతే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని సీఎం హెచ్చరించారు..
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.