ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది.
అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల పసికందుకు నిర్దయగా వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
ఆహార కల్తీపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్-ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు.
కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ పర్యాటక సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్నిచ్చాయని కొనియాడారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల విడుదలను వేగవంతం చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.6,590.37 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తులను ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఓబీఎంఎంఎస్ (OBMMS) పోర్టల్ను ప్రారంభించారు.