సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ, R&R కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దని చెప్పుకొచ్చారు.
రాజస్థాన్ -హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ జలమండలి సిటిజన్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ చేసుకునే సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని జలమండలి అధికారులు తెలిపారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. సూసైడ్ నోట్, ఆధారాలున్న ఐఫోన్ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. పెద్ది కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బాస్కెట్ బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో పృథ్వీశ్వర్ను తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన నిరుద్యోగులను అవమానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు.
హైదరాబాద్ ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనుల నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్కుమార్ తెలిపారు.