బీఆర్ఎస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్లో ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణాలపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులపై శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఇళ్ల నిర్మాణాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
99 రోజుల ప్రణాళికలో పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు కేటాయిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బుధవారం అసెంబీలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్లపై చర్చ జరిగింది.
పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది.
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్కు అనువైన ప్రాంతం తెలంగాణ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయంటూ.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో భారతదేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్కు కొరత ఏర్పడింది. కొన్ని రోజులుగా ప్రజలు వంట గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పెట్రోల్ నిల్వలు కూడా దేశంలో తగ్గిపోయాయన్న ప్రచారంతో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కడుతున్నారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ, కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు రెండో రోజు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్లోని అత్తాపూర్లో ఒక సినిమా థియేటర్లలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ‘ధురంధర్ 2’ సినిమా సెకండ్ షో పడిన కొద్దిసేపటికే, రెండు కుటుంబాల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. వివరాల్లోకి వెళితే..