నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రసుతం టమాట ధర తగ్గిపోగా... పచ్చిమిర్చి ధర మాత్రం కొంచెం పెరిగింది. మొత్తంగా.. రైతుబజార్లో ధరల వివరాలు ఎలా ఉన్నాయంటే...
మల్కాజిగిరి నుంచి బరిలో దిగినప్పుడు తనకు జమియత్ స్వచ్ఛందంగా సహకరించిందని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. తాను గల్లీ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఈ సంస్థ సహకరించిందని పేర్కొన్నారు.
మహబూబ్నగర్ ఎంపీ సీటును బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి బహుమానంగా ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదన్నారు. పగ ప్రతీకారాలు తప్ప పాలన మీద దృష్టి లేదంటూ సీఎం రేవంత్ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు.
వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్థులకు ఇంకా 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో గల ఓ ఉమెన్స్ హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలపై కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది.
హైదరాబాద్ లో ఓ బావికి 180 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోంది. కోకాపేటలో ఎప్పుడో పురాతన కాలంలో దీన్ని తవ్వారని సమాచారం. కాగా.. ఈ ఒక్క బావేగాక పురాతన బావులు మొత్తం మూడు ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాగాయకుడు గద్దర్ కళల ద్వారా సమాజానికి తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడని కొనియాడారు డిప్యూటీ సీఎం.