హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో అండర్ పాస్లు, ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్క్ చుట్టూ వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం ప్రకటించారు.
హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్కు చెందిన క్రాంతి గౌడ్గా గుర్తించినట్లు తెలిపారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నతండ్రి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటీవల పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో తండ్రి సల్మాన్.. కన్న కొడుకు అర్మాన్ను పిల్లర్కు గుద్ది రోడ్డు మీద పడేశాడు.
హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయమవడం కలకలం రేపుతోంది. శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైంది.
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం.
హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. కోర్ట్ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు.
ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉన్న ప్రియాంక భౌతికకాయం దగ్గర మంత్రి వాకిటి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాళులర్పించారు.
హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 14న ట్యాంక్ బండ్ దగ్గర భారీ ‘తిరంగా యాత్ర’ను నిర్వహిస్తున్నామని.. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.