మావోయిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న కవులు, కళాకారుల కన్నీటిని, స్నేహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మాననీయకోణంలో చూడాలని, నేరంగా చూడవద్దని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కోరారు.
శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, వాటి అనుబంధ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను గ్రూప్-1, 2 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు....
పార్టీ మారలేదని చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వేలాదిమంది భక్తులు పాల్గొనే ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడ ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా తమ గళాన్ని వినిపించేందుకు ప్రయత్నించినప్పటికీ, మైక్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు రూ.2,408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్ రావు ఎప్పటికీ సీఎం కాలేరని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. పార్టీకి అధ్యక్షుడయ్యే స్థాయి లేని హరీశ్... ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.