ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీ అంటే శుక్రవారం వెలువడనున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరికాసేపట్లో తెరపడనుంది. నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో.. వివిధ పార్టీల నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ గేమింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల భారీ స్కామ్ను పోలీసులు బయటపెట్టారు. డొల్ల కంపెనీలకు దాదాపు రూ.5 వేల కోట్లు మళ్లించినట్లు విచారణలో బయటపడింది..
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ట్రాఫిక్.. జోయల్ డేవిస్ చెప్పారు.
ఇటీవల కాలంలో కొందరు యువతీ యువకులు డిప్రెషన్ కారణంగా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఐదు రోజుల క్రితం హుస్సేన్ సాగర్లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా అత్తాపూర్లో 20 అంతస్తుల భవనంపై నుంచి దూకి యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మూసాపేట్లో అపార్ట్మెంట్స్ నిర్మిస్తామంటూ ఫ్లాట్లు అమ్మకాలు జరిపిన 'వైట్ వాటర్స్' అనే హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ మోసానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏబీఎన్ చేతికి వచ్చింది. దాదాపు 500 మంది నుంచి.. రూ. 270 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ మంత్రి అజారుద్దీన్పై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీ కాకుంటే.. ఆయన మంత్రి పదవి పోతుందని అన్నారు.
సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్లో మొత్తం 26 కీలక సైబర్ క్రైమ్ కేసులను ఛేదించారు. ఒక్క జనవరిలోనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 117 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం గమనార్హం.
నాంపల్లి ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై వివాదం రాజుకొంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లోని విలువైన డేటా అంతా అగ్నిప్రమాదంలో ధ్వంసమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలోని కీలక డేటా మొత్తం కాలిపోయిందని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే..
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రాపర్టీ రూమ్లో నిన్న(శనివారం) అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీవాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు..