హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Feb 08 , 2026 | 08:35 PM
హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్పై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా కేసులు నమోదయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్లో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ట్రాఫిక్.. జోయల్ డేవిస్ చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో నగరవ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో మొత్తం 604 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రోడ్ సేఫ్టీని మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
స్పెషల్ డ్రైవ్ వివరాలు:
ఈ రెండు రోజుల్లో నగరంలోని వివిధ చెక్ పాయింట్ల వద్ద బ్రెత్ అనలైజర్ టెస్టులు, రాండమ్ చెకింగ్ ద్వారా పోలీసులు తనిఖీలు చేశారు. పట్టుబడినవారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే (492 మంది బైక్ రైడర్లు)ఉన్నారు.
మిగతా వివరాలు ఇలా ఉన్నాయి:
బైక్ రైడర్లు: 492
ఆటో డ్రైవర్లు: 42
కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు: 70
మద్యం మోతాదు (బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ - BAC) ఆధారంగా కేసుల విభజన:
51 నుంచి 100 mg/100ml: 238 కేసులు
101 నుంచి 150 mg/100ml: 127 కేసులు
300 mg/100ml కంటే ఎక్కువ: 5 కేసులు.. ఇవి చట్టపరమైన పరిమితి (30 mg/100ml) కంటే చాలా ఎక్కువ స్థాయిలు కావడం గమనార్హం.
ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ మాటల్లో..
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ స్పెషల్ డ్రైవ్ గురించి మాట్లాడుతూ.. 'మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాంతకం. ఇది కేవలం తనకు తానే కాకుండా ఇతరుల జీవితాలకు ముప్పు తెచ్చిపెడుతుంది' అని హెచ్చరించారు. 'డ్రంక్ అండ్ డ్రైవ్పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నాం. ఇలాంటి తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయి' అని స్పష్టం చేశారు. నగరంలో పోలీసులు ఇలాంటి స్పెషల్ డ్రైవ్లను రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. జనవరి నెలలో కూడా వారాంతాల్లో 300–700 మధ్య కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా వీకెండ్లు, ఫెస్టివల్ సీజన్లో ఇవి మరింత తీవ్రంగా ఉంటున్నాయి.' అని డేవిస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..