బాకీ తీర్చలేదని రెండేళ్ల బాలికను కిడ్నాప్నకు ఓ వ్యక్తి యత్నించాడు. అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
హైదరాబాద్ నగర శివారు గ్రామాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ప్రభావం భూముల క్రయ విక్రయాలపై పడింది.
హైదరాబాద్లో ట్రాఫిక్జామ్కు చెక్ పెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్-సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు ప్రారంభం అయ్యాయి.
తెలంగాణలో ఎక్కడ పడితే అక్కడ భూముల అమ్మకాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భూముల అమ్మకాలపై ప్రశ్నలు సంధిస్తూ సీఎంకు హరీశ్ లేఖ రాశారు.
హైదరాబాద్లోని ఆస్మాన్ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల మార్పులు, పేర్ల మార్పులకు ఈసీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G 2.0) కింద తెలంగాణ రాష్ట్రానికి సమగ్ర ప్రాతిపదికన ఒకేసారి 11,56,915 ఇళ్లను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోయాలని దిశానిర్దేశం చేశారు.
మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం రేవంత్రెడ్డి నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందని కొనియాడారు.
ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులను ఆగస్టు 13వ తేదీన సన్మానిస్తామని తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.