కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 28, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న హీరో షోరూంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:15 గంటల వరకు 11కేవీ జవహర్ నగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ ఉండదని తెలిపారు.
తెలంగాణలో ఇవాళ జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోనుందని చెప్పింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి.
ఆన్లైన్ లోన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్వర్క్ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మూసీ నది అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టనున్నారు అధికారులు.
జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.
బంజారాహిల్స్లో ప్రముఖ డిజైనర్ అనుశ్రీ రెడ్డి నిర్వహిస్తున్న డిజైనర్ స్టోర్లో చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో షూ ముద్రలు కీలకంగా మారాయి.