కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూరగాయలు విక్రయించేందుకు వ్యాపారులకు సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది. తైబజార్ టెండరులో మున్సిపాలిటీకి ఆదాయం వస్తున్నా వసతుల కల్పించటం లేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు.
రాష్ట్రంలో వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు.
నిర్మల్... ఒక భౌగోళిక ప్రదేశం కాదు... కాలగర్భంలో చెక్కబడిన ఒక జ్ఞాపకగాథ. సహ్యాద్రి శ్రేణుల నిశ్శబ్ద వీణలో, గోదావరి పరవళ్లలో, దక్కన్ పీఠభూమి రాతిగుట్టల ఎత్తుపల్లాల ఊపిరిలో... ఈ నేల శతాబ్దాల సంచారాన్ని మోస్తోంది.
జిల్లావ్యాప్తంగా పంటల మార్పిడి జరగకపోవడంతో రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలో పప్పు దినుసులు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగు ఏటేటా తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
భానుడి భగభగతో జనం అల్లాడుతున్నారు. ఉదయం తొమ్మిది దాటకముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
కాగజ్నగర్ మండలంలో లోవోల్టేజీ సమస్యను తీర్చేందుకు కొత్తగా మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీ్ష్ బాబు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని కలెక్టర్ కె హరిత అన్నారు. దహెగాం మండలం ఐనం గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ పంట సాగుపై రైతులకు సాగులో మెలకువలు, లాభాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక పార్కు రాముని చెరువు సుందరీకరణ పనులకు సంవత్సరాలు గడుస్తు న్నా మోక్షం లభించడంలేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు సెలవులు, ఖాళీ సమయాల్లో ఉల్లాసంగా గడపలేని పరిస్థితి నెలకొంది.