కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుల గోదాములకు వెంటవెంటనే తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఆదివారం మండలం లోని కన్నెపల్లిలో వెంకటేశ్వర్ల, లింగాపూర్లో రామ్లక్ష్మణ్, లక్ష్మీకాంతపూర్ జయలక్ష్మి, కాసిపేటలో రైస్ మిల్లుల గోదాములను జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
జిల్లాలో ఆయిల్పామ్ సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లుగా జిల్లా ఉద్యానశాఖ అధికారులు రైతుల్లో ఆయిల్పామ్ సాగుపై అవగాహన పెంచుతూ వస్తున్నారు.
పాత కక్షలు, కుటుంబ కలహాలతో దహెగాం మండ లం మొట్లగూడ గ్రామంలో శనివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు చేసిన వినియోగించినా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ ల అధికారులతో నిర్వహించిన సమావేశానికి అదనపు ఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జూన్ 2న కెరమెరి మండలంలోని కోటారి గ్రామంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ నితికా పంత్ అధికారులను ఆదేశించారు
ఆసిఫాబాద్లో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా బాలికను సురక్షితంగా బయటకు తీశారు.
భగ్గుమంటున్న ఎండల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. వారం పదిరోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విపరీతమైన దాహార్తితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్య ప్రతాపం కారణంగా మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఆన్లైన్ మందుల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలని మంచిర్యాల డిస్ర్టిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా గొల్లపల్లి రైతులు బుధవారం ధర్నాకు దిగారు. బస్తాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి బైఠాయించారు.
ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరు దొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి.