Home » Telangana » Adilabad
కొత్త జిల్లాలు అలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారం అందిస్తు న్నారు. అయితే పాలు, కోడిగుడ్లు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కొత్తగా యాప్లను అందుబాటులోకి తెచ్చింది.
కాగజ్నగర్, మే 3: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కార్మికక్షేత్రంలో ఓట్లను రాబట్టుకునేందుకు ఆయాపార్టీల నాయకులు ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.
ఆసిఫాబాద్, మే 3: చిన్న జిల్లాలను కుదించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆదివాసీల జిల్లా ఆసిఫాబాద్కు జోలికివస్తే ఊర్కునేది లేదని ఎమ్మెల్యే కోవలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆసిఫాబాద్ రూరల్, మే 3: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కాగజ్నగర్ పట్ట ణంలో నిర్వహించే కేంద్ర హోంమంత్రి అమిత్షా బహిరంగ సభకు జిల్లాలోని పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి అలిజాపూర్ శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
ఆసిఫాబాద్, మే 3: ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్బ్యాలెట్ను సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే అన్నారు.
సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి చెల్లించిన ఆదాయ పన్నును తిరిగి చెల్లించడానికి సీఎం రేవంత్రెడ్డి ఒప్పుకున్నారని, త్వరలోనే ప్రకటన చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద అన్నారు.
పెంచికలపేట, మే 3: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాటలను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు అన్నారు. శుక్ర వారం మండలంలోని బొంబా యిగూడ, పోతెపల్లి, చెడ్వాయి, దర్గపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.
పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో పిల్లలు ఆటాపాటల్లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే వేసవి వేడికి చిన్నారులు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 13న జరిగే పోలింగ్ కోసం అదనపు బ్యాలెట్ యూనిట్లను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ర్యాండమై జేషన్ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సం తోష్ పేర్కొన్నారు.