Home » YSRCP
వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగా పలు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు రక్తచరిత్ర లిఖించారు. జంతు బలులుచేసి.. ఫ్లెక్సీలకు రక్తాభిషేకాలుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.
అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కంకర మిషన్ను అధికారులు మూసివేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంలో మిల్లును మూసివేసినట్లు అధికారులు పేర్కొంటున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది రాజకీయ డ్రామానేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో మొదట నుంచి బీజేపీనే పోరాటం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని తెలిపారు..
రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు.
వైసీపీ నేత, రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి 2014 నుంచి 2024 వరకు తన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ వివరాలివీ...
పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు.
జగన్ హయాంలో దళితులపై దాడులు చేశారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. ఈ ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పుకొచ్చారు. వెలిగొండకు డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో వేలాది మంది అనుచరులతో బైక్ ర్యాలీగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.