• Home » YSRCP

YSRCP

AP Ministers: జగన్ అండ్ కో విచ్చలవిడిగా దోపిడీ, లూటీ చేశారు.. ఏపీ మంత్రుల ఫైర్

AP Ministers: జగన్ అండ్ కో విచ్చలవిడిగా దోపిడీ, లూటీ చేశారు.. ఏపీ మంత్రుల ఫైర్

ప్రైవేట్ చేతుల్లో ఉన్న లిక్కర్ వ్యాపారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకం దాకా అంతా జగనే పర్యవేక్షించారని ఆరోపించారు. చిరు వ్యాపారుల దగ్గర కూడా ఆన్‌లైన్ సేవలు ఉంటాయని... కానీ వేల కోట్ల వ్యాపారం చేసే లిక్కర్ షాపుల్లో ఎందుకు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

 AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు రిమాండ్ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులు శుక్రవారం ఏసీబీ కోర్టు‌లో హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా 12 మంది నిందితులకు ఈనెల13వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తోక కట్‌ చేస్తా: సీఎం చంద్రబాబు..

ఎన్టీఆర్‌ ఆలోచన నుంచే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తి చేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టంచేశారు.

Cases Against Nellore YCP Leaders : జగన్ పర్యటన.. కేసులు నమోదు

Cases Against Nellore YCP Leaders : జగన్ పర్యటన.. కేసులు నమోదు

మాజీ సీఎం జగన్ ఎక్కడ పర్యటన వెళ్లినా.. ఆ పర్యటన ఓ వివాదంగా మారుతోంది. తాజాగా ఆయన నిన్న చేసిన నెల్లూరు పర్యటనలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ.. పలువురి వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

AP Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు

AP Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు

Palla Srinivasa Rao: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. జగన్‌ అండ్ కోపై పల్లా  ఫైర్

Palla Srinivasa Rao: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. జగన్‌ అండ్ కోపై పల్లా ఫైర్

గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.

Devineni Uma Slams Jagan: తప్పుడు ప్రచారాలతో సీఎం చంద్రబాబుపై విషం కక్కుతున్నారు.. జగన్‌పై దేవినేని ఫైర్

Devineni Uma Slams Jagan: తప్పుడు ప్రచారాలతో సీఎం చంద్రబాబుపై విషం కక్కుతున్నారు.. జగన్‌పై దేవినేని ఫైర్

ఐదేళ్ల విధ్వంస పాలనతో జగన్ వేలకోట్ల దోపిడీ చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మళ్లీ ఇప్పుడు జగన్ అండ్ కో శ్రీరంగ నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. సీబీఐ ఈడీ క్రిమినల్ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ప్రజాస్వామ్యం అంటూ నీతి సూత్రాలు చెబుతున్న జగన్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కక తప్పదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు.

YS Jagan: జగన్ నెల్లూరు పర్యటనకి పోలీసుల ఆంక్షలు

YS Jagan: జగన్ నెల్లూరు పర్యటనకి పోలీసుల ఆంక్షలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ నెల 31వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ మాట్లాడారు.

AP Police Association  VS YSRCP:  తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. వైసీపీకి పోలీస్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్

AP Police Association VS YSRCP: తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారు.. వైసీపీకి పోలీస్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్

చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు చిత్తూరు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధికారులు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంసీ విజయా నందరెడ్డి చిత్తూరు జిల్లా పోలీసు అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Minister Payyavula Keshav: మద్యం స్కాంలో జగన్ వేలకోట్లు దాచుకున్నారు: మంత్రి పయ్యావుల

Minister Payyavula Keshav: మద్యం స్కాంలో జగన్ వేలకోట్లు దాచుకున్నారు: మంత్రి పయ్యావుల

ఏపీలో అనేక ప్రాంతాల్లో డెన్‌‌లు ఏర్పాటుచేసి జగన్ అండ్ కో వేలకోట్లు దాచుకున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూ.200 కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అండ్ కో చేసిన లిక్కర్ స్కాం రూ. 3500 కోట్లు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అక్రమాలు బయటకు వస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి పయ్యావుల ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి