Lokesh Slams YSRCP: దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
ABN , Publish Date - Sep 23 , 2025 | 10:27 AM
జీఎస్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అని నిన్న (సోమవారం) టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వైసీపీ మూగబోయిందన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్సీలంతా విచ్ఛిన్నమయ్యారని ఎద్దేవా చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23: శాసనమండలిలోనూ వైసీపీకి సౌండ్ లేదని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మంత్రి మాట్లాడుతూ... జీఎస్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అని నిన్న (సోమవారం) టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వైసీపీ మూగబోయిందన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఎమ్మెల్సీలంతా విచ్ఛిన్నమయ్యారని ఎద్దేవా చేశారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు 4 వేల కోట్లు పెట్టి.. ఆ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వటం విడ్డూరమని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్నాయి. శాసనమండలి ముందుకు వివిధ వార్షిక నివేదికలను మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్లు సమర్పించనున్నారు. అనంతరం నేడు శాసనమండలిలో 2025 ఆంధ్రప్రదేశ్ అబ్కారీ సవరణ బిల్లును మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిపాదించనున్నారు. అనంతరం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఉపాధి, విశాఖ ఉక్కు కర్మాగారస్థితిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
ఇవి కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
Read Latest AP News And Telugu News