Home » YSRCP
కాకినాడ కార్పొరేషన్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జారీచేసిన రూ.411కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణంపై బాధ్యులపై భర్యలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిగి ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది.
గతంలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనేనని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భూమన కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిట్ట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఫ్యాన్ పార్టీ నేతలు పలుచన అవుతున్న క్రమంలోనే పలాయన వాదం అందుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చంద్రబాబుకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గతంలో గొడవలు జరిగాయన్న విషయాన్ని ఇప్పుడు జగన్ అండ్ కో లేవనెత్తారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.
నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.
అన్నవరం సత్యదేవుని కొండపై వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. దేవస్థానంలో బహిరంగ వేలంలో హెచ్చుపాటదారుడుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. స్వామివారికి అలంకరణ అనంతరం వాడిపోయే పూలను తరలించే కాంట్రాక్టు పనికి ఆలయ అధికారులు బహిరంగ వేలం వేశారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
గుడివాడ అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారని తెలుగుదేశం విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ ధ్వజమెత్తారు. అమర్నాథ్ లాగా తాము దిగజారి మాట్లాడమని పేర్కొన్నారు. దిగజారి మాట్లాడేవాళ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కేవలం కుల సమీకరణాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను ఇచ్చిందని ఆక్షేపించారు.
తమ ప్రభుత్వంలో సూపర్ సిక్స్తో పాటు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్ఘాటించారు. అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, పథకాలకు యాభై వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. గత జగన్ ప్రభుత్వంలో రూ.1000లు పింఛన్ పెంచడానికే ఐదేళ్లు పట్టిందని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు.